అక్షరటుడే, వెబ్డెస్క్: Konda Murali | ఉమ్మడి వరంగల్ జిల్లా కాంగ్రెస్లో విభేదాలు తారాస్థాయికి చేరిన విషయం తెలిసిందే. మంత్రి కొండా సురేఖ దంపతులు, మిగతా కాంగ్రెస్ ఎమ్మెల్యే(Congress MLA)లకు మధ్య పొసగడం లేదు. వారి మధ్య కొంతకాలంగా కోల్డ్ వారు జరుగుతుండగా ఇటీవల కొండా మురళి వ్యాఖ్యలతో అది కాస్తా బయట పడింది. దీంతో ఆయనపై కాంగ్రెస్ ఎమ్మెల్యేలు అధిష్టానానికి ఫిర్యాదు చేశారు.
Konda Murali | వివాదాస్పద వ్యాఖ్యలు
ఇటీవల కొండా మురళి(Konda Murali) కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కడియం శ్రీహరి(Kadiyam Srihari), రేవూరి ప్రకాశ్రెడ్డి(Revuri Prakash Reddy)పై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఇతర పార్టీలో నుంచి వచ్చిన వారు దమ్ముంటే రాజీనామా చేసి గెలవాలని స్టేషన్ ఘన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరిని ఉద్దేశించి మురళి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. అలాగే పరకాల ఎమ్మెల్యే రేవూరి ఎన్నికల ముందు తన కాళ్లు పట్టుకున్నారన్నారు. మంత్రి కొండా సురేఖ(Minister Konda Surekha) సైతం కడియం నల్లికుట్ల మనిషని, వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి భద్రకాళి ఆలయ అభివృద్ధిని అడ్డుకుంటున్నారని ఆరోపించారు.
Konda Murali | మీనాక్షి నటరాజన్కు ఫిర్యాదు
కొండా దంపతుల తీరుపై ఉమ్మడి వరంగల్ జిల్లాలోని కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, పలువురు నాయకులు ఇటీవల సమావేశం అయ్యారు. అనంతరం వారిపై కాంగ్రెస్ రాష్ట్ర ఇన్ఛార్జి మీనాక్షి నటరాజన్(Meenakshi Natarajan)కు ఫిర్యాదు చేశారు. ఈ క్రమంలో శనివారం పీసీసీ క్రమశిక్షణ కమిటీ సమావేశం నిర్వహిస్తున్నారు. విచారణకు హాజరు కావాలని కమిటీ ఇదివరకే కొండా మురళికి నోటీసులు జారీ చేసింది. దీంతో ఆయన గాంధీభవన్(Gandhi Bhavan)లో జరుగుతున్న సమావేశానికి హాజరయ్యారు. మురళి తన వ్యాఖ్యలపై వివరణ ఇచ్చినట్లు తెలిసింది. అయితే పార్టీ ఎమ్మెల్యేలు ఇష్టారీతిన మాట్లాడిన కొండా మురళిపై చర్యలు తీసుకుంటారా.. మందలించి వదిలేస్తారా అనేది చూడాలి.