అక్షరటుడే, బాన్సువాడ: RTC banswada | ప్రయాణికులకు ఆర్టీసీ సువర్ణావకాశాన్ని కల్పించింది. కుటుంబ సభ్యులు ఏదైనా పుణ్యక్షేత్రాలకు వెళ్లాల్సి వస్తే ప్రైవేటు బస్సులు, బస్ ట్రావెల్స్ ఏజెన్సీలతో (Bus Travel Agency) మాట్లాడుకుని వాహనాలను బుక్ చేసుకుంటారు. అయితే ఈ ట్రిప్లకు ఖర్చు కూడా భారీగానే ఉంటుంది. ఇలాంటి వారికోసం ఆర్టీసీ యాజమాన్యం వెసులుబాటు కల్పించింది. పుణ్యక్షేత్రాలకు, విహారయాత్రలకు వెళ్లాలనుకునే వారి కోసం ప్రత్యేకంగా టూర్ ప్యాకేజీలను ప్రకటిస్తోంది.
RTC banswada | భద్రకాళి అమ్మవారి దర్శనం..
బాన్సువాడ నుంచి వరంగల్ (Warangal) జిల్లాలోని రామప్ప, లక్నవరం, భద్రకాళి గుడి ప్యాకేజీ టూర్ ఈనెల 6న డీలక్స్ బస్సు బయలుదేరుతున్నట్లు డిపో మేనేజర్ సరిదా దేవి తెలిపారు. ఉదయం 6 గంటలకు బయలుదేరి పాలంపేటలోని రామప్ప శివుని (రామలింగేశ్వరుని) దర్శనం తర్వాత లక్నవరం సస్పెన్షన్ బ్రిడ్జి/లేక్ వ్యూ తర్వాత భద్రకాళి అమ్మవారి దర్శనం చేసుకొని రాత్రి 11 గంటలకు బాన్సువాడకు చేరుకుంటుందని తెలిపారు. టికెట్ ధర పెద్దలకు రూ. 1500, పిల్లలకు రూ. 750 ఆన్లైన్లో బుక్ చేసుకోవాలని సూచించారు. www.tgsrtcbus.inలో (సర్వీసు నెంబర్: 96668 ) బాన్సువాడ-లక్నవరం అనే రూట్లో బుకింగ్ చేసుకోవచ్చన్నారు. లేదా టికెట్స్ బుకింగ్ కోసం గోపికృష్ణ 9063408477ను సంప్రదించాలని డీఎం పేర్కొన్నారు.
RTC banswada | ఇటీవల బాన్సువాడ నుంచి యాదగిరిగుట్టకు..
ఇటీవలే బాన్సువాడ నుంచి యాదగిరిగుట్ట (Yadagiri Gutta), స్వర్ణగిరికి (Swarnagiri) డీలక్స్ బస్సు ప్యాకేజీ టూర్ను విజయవంతం చేశారు. ఈనెల27న డీలక్స్ బస్సు ప్రయాణికులను తీసుకెళ్లింది. టూర్ ప్యాకేజీలు కూడా అందుబాటులో ఉండడంతో ప్రయాణికలు ఆర్టీసీ బస్సుల్లో వెళ్లేందుకు ఆసక్తి చూపుతున్నారు.