అక్షరటుడే, వెబ్డెస్క్ : Weather Updates | రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో శనివారం తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ (Meteorological Department) అధికారులు తెలిపారు. తేమతో కూడిన వేడి వాతావరణం ఉంటుందని పేర్కొన్నారు.
రాష్ట్రంలో మూడు రోజుల పాటు పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు (Heavy Rains) కురిశాయి. అయితే శుక్రవారం నుంచి వర్షాలు తగ్గాయి. శనివారం కూడా తేలికపాటి, చిరుజల్లులు మాత్రమే పడుతాయని అధికారులు తెలిపారు. ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల, పెద్దపల్లి, భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి – కొత్తగూడెం జిల్లాల్లో రాత్రి పూట వర్షం పడే ఛాన్స్ ఉందన్నారు. వికారాబాద్, రంగారెడ్డి, మహబూబ్నగర్, వనపర్తి జిల్లాల్లో చిరుజల్లులు పడుతాయని పేర్కొన్నారు. మిగతా ప్రాంతాల్లో వాతావరణం పొడిగా ఉంటుందని తెలిపారు. జూన్ 30 తర్వాత రాష్ట్రంలో విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం ఉందని వివరించారు.