అక్షరటుడే, వెబ్డెస్క్: Sukhoi jets : పహల్గామ్ ఉగ్రదాడి (Pahalgaon terror attack) తర్వాత పీవోకే PoK లోని ఉగ్ర స్థావరాలే లక్ష్యంగా భారత్ ఆపరేషన్ సిందూర్ (Operation Sindoor) చేపట్టింది. బృహత్తరమైన ఈ ఆపరేషన్లో సుఖోయ్ జెట్లు Sukhoi jets కీలక పాత్ర పోషించాయి. తాజాగా వీటిని అప్గ్రేడ్ చేయాలని కేంద్ర ప్రభుత్వం యోచిస్తోంది.
Sukhoi jets : సుదీర్ఘ చర్చ..
రష్యా రక్షణ మంత్రి ఆండ్రీ బెలోసోవ్తో జరిగిన చర్చల్లో రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ సుఖోయ్ జెట్ల అప్గ్రేడ్ విషయాన్ని ప్రతిపాదించారు. ఎయిర్-టు-ఎయిర్ క్షిపణుల ప్రొడక్షన్, సుఖోయ్-30MKI యుద్ధ విమానాల Sukhoi-30MKI fighter jets అప్గ్రేడ్, S-400 క్షిపణి వ్యవస్థ(S-400 missile system)పై సుదీర్ఘంగా చర్చించారు.
Sukhoi jets : కింగ్డావోలో..
షాంఘై సహకార సంస్థ (SCO) సమావేశం సందర్భంగా చైనాలోని కింగ్డావో(Qingdao)లో నిర్వహించిన ద్వైపాక్షిక సమావేశంలో ఇరు దేశాల రక్షణ మంత్రులు పాల్గొన్నారు. భారత వైమానిక దళం వద్ద సుమారు 260 సుఖోయ్ 30-MKI జెట్లు ఉన్నాయి.
Sukhoi jets : ప్రధానంగా వీటిపైనే చర్చ..
ఆండ్రీ బెలోసోవ్, రాజ్నాథ్ సింగ్ కలిసి ఉగ్రవాదం, ఇండో-రష్యన్ రక్షణ సహకారం తదితర అనేక అంశాలపై ఇరువురు చర్చించినట్లు శుక్రవారం భారత్ రక్షణ మంత్రిత్వ శాఖ ప్రకటించింది. పహల్గామ్ ఉగ్రవాద దాడిపై రష్యా సంఘీభావం తెలిపినట్లు వెల్లడించింది.
“S-400 సరఫరా, సుఖోయ్ MKI అప్గ్రేడ్, సైనిక హార్డ్వేర్ కొనుగోలు.. తదితరాలు ఈ సమావేశంలో చర్చించిన కొన్ని ముఖ్యమైన అంశాలుగా రక్షణ మంత్రిత్వశాఖ తెలిపింది. ఆపరేషన్ సిందూర్ చేపట్టిన నేపథ్యంలో రక్షణ వ్యవస్థను పటిష్ఠం చేయాల్సిన అవసరం ఉన్నట్లు పేర్కొంది. కాగా, 5.5 బిలియన్ డాలర్ల ఒప్పందంలో భాగంగా.. రష్యా(Russia) మూడు యూనిట్ల లాంగ్- రేంజ్ క్షిపణుల(long-range missiles)ను సరఫరా చేయడం గమనార్హం.