అక్షరటుడే, వెబ్డెస్క్ : TRAI | టెలికాం రంగంలో జియో (JIO) దూసుకుపోతుంది. మే నెలలో రికార్డు స్థాయిలో యూజర్లను ఈ సంస్థ పెంచుకోవడం గమనార్హం. 2025 మే నెలకు సంబంధించిన టెలికాం కంపెనీల సబ్స్క్రైబర్ల వివరాలను ట్రాయ్ (TRAI) తాజాగా విడుదల చేసింది.
TRAI | జియో వాటా 40.92శాతం
మే నెలలో జియో కొత్తగా 27 లక్షల యూజర్లను పెంచుకోవడం గమనార్హం. దీంతో ప్రస్తుతం టెలికాం మార్కెట్లో ఆ సంస్థ వాటా 40.92 శాతానికి పెరిగింది. దీంతో ప్రస్తుతం జియో వినియోగదారుల సంఖ్య 47.51 కోట్లకు చేరుకుంది. మరోవైపు ఎయిర్టెల్ (Airtel) మే నెలలో 2.75 లక్షల కస్టమర్లను కొత్తగా యాడ్ చేసుకుంది. మే 31 నాటికి, ఎయిర్టెల్ మొత్తం వినియోగదారుల సంఖ్య 39.02 కోట్లకు పెరిగింది. మార్కెట్లో ఎయిర్టెల్ వాటా 33.61 శాతానికి చేరుకుంది.
TRAI | పడిపోయిన బీఎస్ఎన్ఎల్, వీఐ కస్టమర్లు
జియో, ఎయిర్టెల్ కస్టమర్లను యాడ్ చేసుకుంటూ.. మార్కెట్లో వాటా పెంచుకుంటుంటే వొడాఫోన్ ఐడియా (VI), బీఎస్ఎన్ఎల్ (BSNL) మాత్రం తమ యూజర్లను కోల్పోయాయి. వొడాఫోన్ ఐడియా 2.74 లక్షల వినియోగదారులను, బీఎస్ఎన్ఎల్ 1.35 లక్షల కస్టమర్లను కోల్పోవడం గమనార్హం. ప్రస్తుతం వోడాఫోన్ ఐడియా 20.44 కోట్లు BSNL 9.07 కోట్ల వినియోగదారులను కలిగి ఉన్నాయి.
TRAI | మొత్తం యూజర్లు 116 కోట్లు
దేశంలో 2025 మే 31 నాటికి మొబైల్ యూజర్ల సంఖ్య 116.84 కోట్లకు పెరిగింది. ఏప్రిల్లో 116.64 కోట్లు ఉండగా.. కొత్తగా ఒక నెలలోనే 20 లక్షల మంది కొత్త సిమ్కార్డులు తీసుకున్నారు.