More
    HomeజాతీయంKarnataka | విష ప్ర‌యోగం.. ఏకంగా ఐదు పులులు మృతి

    Karnataka | విష ప్ర‌యోగం.. ఏకంగా ఐదు పులులు మృతి

    Published on

    అక్షరటుడే, వెబ్​డెస్క్ :Karnataka | కర్ణాటక – కేరళ సరిహద్దులోని మలై మహదేవేశ్వర వన్యప్రాణి విభాగం (Malai Mahadeshwara Wildlife Division)లో వన్యప్రాణి ప్రేమికులను కలిచివేసే ఘటన చోటుచేసుకుంది. అక్కడ ఒక తల్లి పులి, నాలుగు పిల్ల‌లు విషప్రయోగం(Poisoning) కారణంగా మృతి చెందినట్లు అటవీ శాఖ ప్రాథమికంగా నిర్ధారించింది. ఈ ఘటనపై తీవ్ర ఆందోళన వ్యక్తమవుతోంది. ఒకేరోజు ఐదు పులులు మరణించడం రాష్ట్రంలో ఇదే తొలిసారి అని అధికారులు చెప్పుకొచ్చారు. అటవీ అధికారులు వెల్లడించిన వివరాల ప్రకారం.. మరణించిన పులులకు సమీపంలో ఒక ఆవు కళేబరం కనిపించింది. కొన్ని రోజుల క్రితం ఆ పులి ఆవును చంపినట్టు గుర్తించారు అధికారులు. అయితే స్థానిక గ్రామస్థులు ప్రతీకారంగా ఆవు మాంసంలో విషం కలిపి ఎర వేసి ఉండొచ్చని అనుమానిస్తున్నారు.

    READ ALSO  LOVE | ప్రేమించినవాడు దక్కలేదని 11 రాష్ట్రాల్ని వణికించింది..!

    Karnataka | మృతిపై అనుమానాలు

    మృతదేహాలపై శవ పరీక్ష నిర్వహించగా, విషపదార్థాల ప్రభావమే మృతికి కారణమని స్పష్టమైంది. ఫోరెన్సిక్ నివేదికను(Forensic Report) కూడా అనుసంధానించి, తుది నిర్ధారణకు సిద్ధమవుతున్నారు. ఈ ఘటనపై స్పందించిన రాష్ట్ర అటవీ శాఖ మంత్రి ఈశ్వర్ ఖండ్రే(Ishwar Khandre), “ఇది తీవ్రమైన ఘటన. మూడు రోజుల్లోగా పూర్తి నివేదిక సమర్పించాలని అధికారులను ఆదేశించాం. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటాం’ అని చెప్పారు. ప్రస్తుతం కర్ణాటకలో 563 పులులు ఉన్నాయని అటవీ శాఖ(Forest Department) వెల్లడించింది. మధ్యప్రదేశ్ తర్వాత ఎక్కువగా పులులు ఈ రాష్ట్రంలోనే ఉన్నాయి. పులుల సంరక్షణ కోసం రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నాయి. కాగా.. గ్రామీణ ప్రాంతాల్లో పశువులపై దాడులు జరగడం, గ్రామస్థులు తమ పశువులను కాపాడుకునేందుకు వన్యప్రాణులపై విషప్రయోగానికి పాల్పడటం వంటి ఘటనలు వన్యప్రాణులకు ముప్పుగా మారుతున్నాయి.

    READ ALSO  Cyber ​​Crime | రూ. 2 వేల కోట్ల సైబర్‌ మోసం.. ఏకంగా చైనాతో లింకులు!

    ఈ సంఘటన వన్యప్రాణుల (Wildlife animals) రక్షణ చర్యల్లో ఉన్న లోపాలను మరోసారి బయటపెట్టింది. గ్రామస్థులు తమ పశుసంపదను కాపాడుకోవడానికి అడవి జంతువులపై ఇలాంటి విధమైన చర్యలకు పాల్పడడంపై ఆందోళన వ్యక్తమవుతోంది. ప్రభుత్వం, అటవీ శాఖలు, స్థానిక ప్రజల మధ్య అవగాహన పెంచాల్సిన అవసరం మరింత స్పష్టమవుతోంది. పర్యావరణ ప్రేమికులు, వన్యప్రాణి సంరక్షకులు ఈ ఘటనపై తీవ్రంగా స్పందిస్తూ, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.

    Latest articles

    Anchor Swecha |న్యూస్​ ఛానల్​ యాంకర్ స్వేచ్ఛ సూసైడ్

    అక్షరటుడే, హైదరాబాద్: Anchor Swecha : టీవీ యాంకర్​(TV anchor) ఆత్మహత్య చేసుకుంది. న్యూస్ ఛానల్​లో పనిచేసే యాంకర్...

    Judas strike | 30 నుంచి తెలంగాణ జూడాల సమ్మె.. ప్రకటించిన TJUDA

    అక్షరటుడే, హైదరాబాద్: Judas strike : తమ డిమాండ్​ల సాధనకు తెలంగాణ(Telangana)లో జూనియర్​ డాక్టర్లు (junior doctors) సమ్మె...

    Sukhoi jets | సుఖోయ్​ జెట్​ల అప్​గ్రేడ్.. S-400 వ్యవస్థల కొనుగోలు.. రష్యాతో భారత్​ సుదీర్ఘ చర్చ..

    అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Sukhoi jets : పహల్గామ్​ ఉగ్రదాడి (Pahalgaon terror attack) తర్వాత పీవోకే PoK లోని...

    Youth Congress | స్థానిక ఎన్నికల్లో యువతకు పెద్దపీట వేసేందుకు కృషి

    అక్షరటుడే, నిజామాబాద్ అర్బన్: Youth Congress | రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో యూత్ కాంగ్రెస్ నాయకులకు ప్రాధాన్యత...

    More like this

    Anchor Swecha |న్యూస్​ ఛానల్​ యాంకర్ స్వేచ్ఛ సూసైడ్

    అక్షరటుడే, హైదరాబాద్: Anchor Swecha : టీవీ యాంకర్​(TV anchor) ఆత్మహత్య చేసుకుంది. న్యూస్ ఛానల్​లో పనిచేసే యాంకర్...

    Judas strike | 30 నుంచి తెలంగాణ జూడాల సమ్మె.. ప్రకటించిన TJUDA

    అక్షరటుడే, హైదరాబాద్: Judas strike : తమ డిమాండ్​ల సాధనకు తెలంగాణ(Telangana)లో జూనియర్​ డాక్టర్లు (junior doctors) సమ్మె...

    Sukhoi jets | సుఖోయ్​ జెట్​ల అప్​గ్రేడ్.. S-400 వ్యవస్థల కొనుగోలు.. రష్యాతో భారత్​ సుదీర్ఘ చర్చ..

    అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Sukhoi jets : పహల్గామ్​ ఉగ్రదాడి (Pahalgaon terror attack) తర్వాత పీవోకే PoK లోని...