More
    HomeతెలంగాణPhone Tapping Case | కేసీఆర్​, కేటీఆర్​ జైలుకు వెళ్తేనే న్యాయం జరుగుతుంది : కొండా...

    Phone Tapping Case | కేసీఆర్​, కేటీఆర్​ జైలుకు వెళ్తేనే న్యాయం జరుగుతుంది : కొండా విశ్వేశ్వర్ రెడ్డి

    Published on

    అక్షరటుడే, వెబ్​డెస్క్ :Phone Tapping Case | ఫోన్​ ట్యాపింగ్​ వ్యవహారంలో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్(Former CM KCR)​, మాజీ మంత్రి కేటీఆర్(former Minister KTR)​ జైలుకు వెళ్తేనే న్యాయం జరుగుతుందని బీజేపీ ఎంపీ కొండా విశ్వేశ్వర్​రెడ్డి అన్నారు. గతంలో ఆయన ఫోన్​ ట్యాప్​ అయినట్లు సిట్​ అధికారులు గుర్తించారు. ఈ మేరకు ఆయన వాంగ్మూలం సేకరించేందుకు రావాలని నోటీసులు ఇచ్చారు. ఈ క్రమంలో కొండా విశ్వేశ్వర్​రెడ్డి(Konda Vishweshwar Reddy) శుక్రవారం సిట్​ ఎదుట హాజరై వాంగ్మూలం ఇచ్చారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు.

    బీఆర్​ఎస్​ హయాంలో తన భార్య ఫోన్​ కూడా ట్యాప్​ చేశారన్నారు. ఫోన్​ ట్యాప్​ చేసి తనను బెదిరించినట్లు ఆయన ఆరోపించారు. డీజీపీ మహేందర్​రెడ్డి(DGP Mahender Reddy) సైతం తనను బెదిరించారని.. అరెస్ట్ అవుతారని చెప్పారన్నారు. దీంతో తాను రెండు వారాలు బెంగళూరుకు పారిపోయి హోటల్​లో ఉన్నట్లు ఎంపీ తెలిపారు. ఫోన్ ట్యాపింగ్ కేసు(Phone Tapping Case)లో కీలకమైన కేసీఆర్, కేటీఆర్​పై చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్​ చేశారు. రాష్ట్ర ప్రభుత్వంతో కాకపోతే కేంద్ర ఏజెన్సీలకు కేసును అప్పగించాలని సూచించారు. ఫోన్​ ట్యాపింగ్​ వ్యవహారాన్ని తాము పార్లమెంట్​లో లేవనెత్తుతామని కొండా విశ్వేశ్వర్​రెడ్డి పేర్కొన్నారు. కుటుంబ పాలన ఉన్న ప్రాంతీయ పార్టీలతో ఇలాంటి ఘటనలు జరుగుతాయన్నారు. అయితే ఇలాంటివి మళ్లీ జరగకుండా నిందితులను శిక్షించాలని కోరారు.

    READ ALSO  Phone Tapping Case | ఫోన్ ట్యాపింగ్ కేసులో కేసీఆర్, కేటీఆర్​కు నోటీసులు ఇవ్వాలి: బండి సంజయ్

    Phone Tapping Case | కాంగ్రెస్​లో చేరడంతో..

    కొండా విశ్వేశ్వర్​రెడ్డి 2014లో బీఆర్ఎస్​ నుంచి చేవెళ్ల ఎంపీగా గెలుపొందారు. పార్టీలో ఉద్యమకారులకు సరైన ప్రాధాన్యత ఇవ్వడం లేదని 2018 నవంబర్​లో పార్టీకి రాజీనామా చేశారు. అనంతరం ఆయన కాంగ్రెస్​లో చేరారు. 2019లో ఆయన కాంగ్రెస్​ నుంచి ఎంపీగా పోటీ చేసి ఓడిపోయారు. అయితే ఆయన కాంగ్రెస్​లో చేరినప్పటి నుంచే బీఆర్​ఎస్​ నిఘా పెట్టినట్లు సమాచారం. ఎన్నికల ముందే తనను అరెస్ట్ చేయాలని చూశారని.. కాకపోతే సింపతి వస్తుందనే భయంతో ఆగిపోయారని కొండా విశ్వేశ్వర్​రెడ్డి పేర్కొన్నారు. 2019 ఎన్నికల అనంతరం తనను బీఆర్​ఎస్​ నాయకులు బెదిరించారన్నారు. కాగా విశ్వేశ్వర్​రెడ్డి 2022 జులైలో బీజేపీలో చేరారు. 2024 లోక్​సభ ఎన్నికల్లో చేవేళ్ల ఎంపీగా విజయం సాధించారు.

    Latest articles

    Judas strike | 30 నుంచి తెలంగాణ జూడాల సమ్మె.. ప్రకటించిన TJUDA

    అక్షరటుడే, హైదరాబాద్: Judas strike : తమ డిమాండ్​ల సాధనకు తెలంగాణ(Telangana)లో జూనియర్​ డాక్టర్లు (junior doctors) సమ్మె...

    Sukhoi jets | సుఖోయ్​ జెట్​ల అప్​గ్రేడ్.. S-400 వ్యవస్థల కొనుగోలు.. రష్యాతో భారత్​ సుదీర్ఘ చర్చ..

    అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Sukhoi jets : పహల్గామ్​ ఉగ్రదాడి (Pahalgaon terror attack) తర్వాత పీవోకే PoK లోని...

    Youth Congress | స్థానిక ఎన్నికల్లో యువతకు పెద్దపీట వేసేందుకు కృషి

    అక్షరటుడే, నిజామాబాద్ అర్బన్: Youth Congress | రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో యూత్ కాంగ్రెస్ నాయకులకు ప్రాధాన్యత...

    Operation Muskaan | పోలీసుల కీలక నిర్ణయం.. నెల రోజుల పాటు ఆపరేషన్​ ముస్కాన్​

    అక్షరటుడే, వెబ్​డెస్క్: Operation Muskaan | తెలంగాణ పోలీసులు (Telangana Police) కీలక నిర్ణయం తీసుకున్నారు. తప్పిపోయిన, బాలకార్మిక,...

    More like this

    Judas strike | 30 నుంచి తెలంగాణ జూడాల సమ్మె.. ప్రకటించిన TJUDA

    అక్షరటుడే, హైదరాబాద్: Judas strike : తమ డిమాండ్​ల సాధనకు తెలంగాణ(Telangana)లో జూనియర్​ డాక్టర్లు (junior doctors) సమ్మె...

    Sukhoi jets | సుఖోయ్​ జెట్​ల అప్​గ్రేడ్.. S-400 వ్యవస్థల కొనుగోలు.. రష్యాతో భారత్​ సుదీర్ఘ చర్చ..

    అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Sukhoi jets : పహల్గామ్​ ఉగ్రదాడి (Pahalgaon terror attack) తర్వాత పీవోకే PoK లోని...

    Youth Congress | స్థానిక ఎన్నికల్లో యువతకు పెద్దపీట వేసేందుకు కృషి

    అక్షరటుడే, నిజామాబాద్ అర్బన్: Youth Congress | రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో యూత్ కాంగ్రెస్ నాయకులకు ప్రాధాన్యత...