అక్షరటుడే, వెబ్డెస్క్ :Phone Tapping Case | ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్(Former CM KCR), మాజీ మంత్రి కేటీఆర్(former Minister KTR) జైలుకు వెళ్తేనే న్యాయం జరుగుతుందని బీజేపీ ఎంపీ కొండా విశ్వేశ్వర్రెడ్డి అన్నారు. గతంలో ఆయన ఫోన్ ట్యాప్ అయినట్లు సిట్ అధికారులు గుర్తించారు. ఈ మేరకు ఆయన వాంగ్మూలం సేకరించేందుకు రావాలని నోటీసులు ఇచ్చారు. ఈ క్రమంలో కొండా విశ్వేశ్వర్రెడ్డి(Konda Vishweshwar Reddy) శుక్రవారం సిట్ ఎదుట హాజరై వాంగ్మూలం ఇచ్చారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు.
బీఆర్ఎస్ హయాంలో తన భార్య ఫోన్ కూడా ట్యాప్ చేశారన్నారు. ఫోన్ ట్యాప్ చేసి తనను బెదిరించినట్లు ఆయన ఆరోపించారు. డీజీపీ మహేందర్రెడ్డి(DGP Mahender Reddy) సైతం తనను బెదిరించారని.. అరెస్ట్ అవుతారని చెప్పారన్నారు. దీంతో తాను రెండు వారాలు బెంగళూరుకు పారిపోయి హోటల్లో ఉన్నట్లు ఎంపీ తెలిపారు. ఫోన్ ట్యాపింగ్ కేసు(Phone Tapping Case)లో కీలకమైన కేసీఆర్, కేటీఆర్పై చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. రాష్ట్ర ప్రభుత్వంతో కాకపోతే కేంద్ర ఏజెన్సీలకు కేసును అప్పగించాలని సూచించారు. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారాన్ని తాము పార్లమెంట్లో లేవనెత్తుతామని కొండా విశ్వేశ్వర్రెడ్డి పేర్కొన్నారు. కుటుంబ పాలన ఉన్న ప్రాంతీయ పార్టీలతో ఇలాంటి ఘటనలు జరుగుతాయన్నారు. అయితే ఇలాంటివి మళ్లీ జరగకుండా నిందితులను శిక్షించాలని కోరారు.
Phone Tapping Case | కాంగ్రెస్లో చేరడంతో..
కొండా విశ్వేశ్వర్రెడ్డి 2014లో బీఆర్ఎస్ నుంచి చేవెళ్ల ఎంపీగా గెలుపొందారు. పార్టీలో ఉద్యమకారులకు సరైన ప్రాధాన్యత ఇవ్వడం లేదని 2018 నవంబర్లో పార్టీకి రాజీనామా చేశారు. అనంతరం ఆయన కాంగ్రెస్లో చేరారు. 2019లో ఆయన కాంగ్రెస్ నుంచి ఎంపీగా పోటీ చేసి ఓడిపోయారు. అయితే ఆయన కాంగ్రెస్లో చేరినప్పటి నుంచే బీఆర్ఎస్ నిఘా పెట్టినట్లు సమాచారం. ఎన్నికల ముందే తనను అరెస్ట్ చేయాలని చూశారని.. కాకపోతే సింపతి వస్తుందనే భయంతో ఆగిపోయారని కొండా విశ్వేశ్వర్రెడ్డి పేర్కొన్నారు. 2019 ఎన్నికల అనంతరం తనను బీఆర్ఎస్ నాయకులు బెదిరించారన్నారు. కాగా విశ్వేశ్వర్రెడ్డి 2022 జులైలో బీజేపీలో చేరారు. 2024 లోక్సభ ఎన్నికల్లో చేవేళ్ల ఎంపీగా విజయం సాధించారు.