అక్షరటుడే, వెబ్డెస్క్: Prashanth Kishor | ఎన్నికల వ్యూహకర్త, జన్ సురాజ్ పార్టీ అధ్యక్షుడు ప్రశాంత్ కిశోర్ తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి(Chief Minister Revanth Reddy)పై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆయన ఓ టీవీ ఛానెల్లో మాట్లాడుతూ.. రేవంత్రెడ్డి వ్యాఖ్యలను ఖండించారు.
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు(Telangana Assembly Elections) ముందు అప్పటి సీఎం కేసీఆర్పై రేవంత్రెడ్డి తీవ్ర విమర్శలు చేశారు. రాజకీయాల్లో భాగంగా పలు విషయాల్లో ఆయనను విమర్శించారు. అయితే ఆ సమయంలో కేసీఆర్ కీలకమైన బాధ్యతల్లో బీహార్కు చెందిన ఐఏఎస్, ఐపీఎస్ అధికారులను నియమించారు. దీనిపై రేవంత్రెడ్డి బీహారీ బ్యాచ్(Bihari Batch) అంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యలపై అప్పట్లో పెద్ద దుమారమే రేగింది. ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు రేవంత్ వ్యాఖ్యలపై మండిపడ్డారు. అంతేగాకుండా కేసీఆర్ డీఎన్ఏ బీహర్ అని ఆయన వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యలపై తాజాగా ప్రశాంత్ కిశోర్(Prashant Kishore) ఓ ఇంటర్వ్యూలో మాట్లాడారు.
Prashanth Kishor | రాహుల్ గాంధీ క్షమాపణ చెప్పాలి
కాంగ్రెస్ ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి బీహారీలపై చేసిన వ్యాఖ్యలకు రాహుల్ గాంధీ(Rahul Gandhi) క్షమాపణ చెప్పాలని ప్రశాంత్ కిశోర్ డిమాండ్ చేశారు. ఈ ఏడాది అక్టోబర్, నవంబర్లో బీహార్లో అసెంబ్లీ ఎన్నికలు(Bihar Assembly Elections) జరిగే అవకాశం ఉంది. ఈ క్రమంలో రాష్ట్రంలో ఎలాగైన పట్టు సాధించాలని జన్ సురాజ్ పార్టీ అధ్యక్షుడు ప్రశాంత్ కిశోర్ ప్రయత్నిస్తున్నారు. ఈ క్రమంలో సీఎం నితీశ్కుమార్(CM Nitish Kumar) తీరుపై పలు ఆందోళనలు కూడా చేపట్టారు. తాజాగా కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ లక్ష్యంగా విమర్శలు చేశారు. బిహార్ గ్రామంలో ఓ రాత్రి అయినా గడపాలని..రాహుల్కు ప్రశాంత్ కిశోర్ సవాల్ విసిరారు. బిహార్ ప్రజలపై సీఎం రేవంత్ వ్యాఖ్యలు ఖండించిన పీకే.. ఆ వ్యాఖ్యలకు రాహుల్ గాంధీ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. తర్వాతే ఆయన బీహార్లో అడుగు పెట్టాలన్నారు.