More
    HomeతెలంగాణPhone Tapping Case | ఫోన్ ట్యాపింగ్ కేసులో ‘సిట్’ అధికారుల ముందుకు ఆంధ్రజ్యోతి...

    Phone Tapping Case | ఫోన్ ట్యాపింగ్ కేసులో ‘సిట్’ అధికారుల ముందుకు ఆంధ్రజ్యోతి ఎండీ రాధాకృష్ణ

    Published on

    అక్షరటుడే, వెబ్​డెస్క్: Phone Tapping Case | ఫోన్‌ ట్యాపింగ్‌ కేసులో సిట్​ అధికారులు విచారణ వేగవంతం చేశారు. బీఆర్​ఎస్​ హయాంలో ఎస్​ఐబీ చీఫ్​ ప్రభాకర్​రావు(SIB Chief Prabhakar Rao), ప్రణీత్‌రావు(Praneeth Rao) ఆధ్వర్యంలో వేలాది మంది ఫోన్లు ట్యాప్​ చేసినట్లు అధికారులు గుర్తించారు. ఈ కేసులో ఇప్పటికే ప్రభాకర్​రావుతో పాటు ప్రణీత్​రావును అధికారులు విచారిస్తున్నారు. వారి విచారణలో పలు కీలక ఆధారాలు సేకరించినట్లు సమాచారం.

    బీఆర్​ఎస్​ హయాంలో ప్రతిపక్ష నాయకులతో పాటు సినీ ప్రముఖులు, జడ్జీలు, వ్యాపారులు, జర్నలిస్ట్​లు, పలువురు అధికారుల ఫోన్లను ట్యాప్​ చేశారు. బీఆర్​ఎస్​ నాయకుల ఫోన్లు కూడా ట్యాప్ చేయడం గమనార్హం. ఈ క్రమంలో సిట్​ అధికారులు ఫోన్​ ట్యాపింగ్​కు గురైన బాధితుల స్టేట్​మెంట్​ కూడా రికార్డు చేస్తున్నారు. ఇందులో భాగంగా శుక్రవారం ఆంధ్రజ్యోతి ఎండీ రాధాకృష్ణ(Andhra Jyothi MD Radhakrishna) వాంగ్మూలం సేకరించారు. ఏసీపీ వెంకటగిరి(ACP Venkatagiri) గంట పాటు రాధాకృష్ణ స్టేట్మెంట్ రికార్డు చేశారు.

    READ ALSO  Govt Employees | ఉద్యోగులకు, పెన్షనర్లకు గుడ్ న్యూస్.. బిల్లులు మంజూరు చేసిన ప్రభుత్వం

    Phone Tapping Case | చర్యలుంటాయా!

    ఫోన్​ ట్యాపింగ్​ వ్యవహారంలో సిట్​ అధికారులు(Sit Officers) దూకుడు పెంచారు. నిందితులను విచారించడంతో పాటు బాధితుల స్టేట్​మెంట్​ రికార్డు చేస్తున్నారు. కాంగ్రెస్​కు చెందిన 200 మంది నాయకుల ఫోన్లు ట్యాప్​ చేసినట్లు సిట్​ గుర్తించింది. అయితే బాధితులు అందరూ కూడా కేసీఆర్(KCR)​, కేటీఆర్(KTR) చెబితేనే తమ ఫోన్లు ట్యాప్​ చేశారని చెబుతున్నారు. మరోవైపు ప్రధాన నిందితుడు ప్రభాకర్​ రావు డీజీపీ ఆదేశాల మేరకు ట్యాపింగ్​ చేసినట్లు తెలిపినట్లు సమాచారం. ఈ మేరకు గతంలో పని చేసిన డీజీపీని కూడా సిట్​ అధికారులు విచారించే అవకాశం ఉంది.

    ఫోన్ ట్యాపింగ్(Phone Tapping)​ వెనక ఉన్నవారిపై చర్యలు తీసుకుంటారా.. లేదా అనేది తెలియాల్సి ఉంది. ఇప్పటికే ప్రభుత్వం చేపట్టిన విద్యుత్​ కమిషన్​ విచారణ ముందుకు సాగడం లేదు. కాళేశ్వరం కమిషన్(Kaleshwaram Commission)​ నివేదిక రాలేదు. ఫార్ములా ఈ కార్​ రేస్​ కేసు విచారణ కూడా నెలలుగా కొనసాగుతోంది. దీంతో ఫోన్​ ట్యాపింగ్​ వ్యవహారంలో కేసీఆర్​, కేటీఆర్​ను అరెస్ట్​ చేయాలని బీజేపీ నాయకులు కోరుతున్నారు. లేదంటే కేసును సీబీఐ(CBI)కి అప్పగించాలని డిమాండ్​ చేస్తున్నారు. మరి ఈ కేసులో ప్రభుత్వం ఎలా ముందుకు వెళ్తుందో చూడాలి.

    READ ALSO  Passport Day | పాస్​పోర్టు దివస్​.. హైదరాబాద్​ ప్రాంతీయ పాస్​పోర్టు కార్యాలయానికి అరుదైన గుర్తింపు

    Latest articles

    Operation Muskaan | పోలీసుల కీలక నిర్ణయం.. నెల రోజుల పాటు ఆపరేషన్​ ముస్కాన్​

    అక్షరటుడే, వెబ్​డెస్క్: Operation Muskaan | తెలంగాణ పోలీసులు (Telangana Police) కీలక నిర్ణయం తీసుకున్నారు. తప్పిపోయిన, బాలకార్మిక,...

    Sub collector Kiranmai | ప్రజావాణిలో స్పందించట్లేదని.. సబ్​కలెక్టర్​కు ఫిర్యాదు

    అక్షరటుడే, నిజాంసాగర్‌: Sub collector Kiranmai | తహశీల్దార్‌ కార్యాలయంలో నిర్వహించిన ప్రజావాణిలో ఫిర్యాదు ఇచ్చినా స్పందించకపోవడంతో ఓ...

    Hyderabad | కలుషిత నీరు సరఫరా.. విద్యార్థుల ప్రాణాలతో చెలగాటం

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Hyderabad | ఎన్నో ఆశలతో హైదరాబాద్​ (Hyderabad) నగరంలో చదువుకోవడానికి వచ్చిన విద్యార్థుల ప్రాణాలతో...

    Collector Nizamabad | ప్రతి విద్యార్థి కళాశాలలో చేరేలా చూడాలి

    అక్షరటుడే, ఇందూరు: Collector Nizamabad | పదో తరగతి ఉత్తీర్ణులైన ప్రతి విద్యార్థి ప్రభుత్వ జూనియర్ కళాశాలలో చేరేలా...

    More like this

    Operation Muskaan | పోలీసుల కీలక నిర్ణయం.. నెల రోజుల పాటు ఆపరేషన్​ ముస్కాన్​

    అక్షరటుడే, వెబ్​డెస్క్: Operation Muskaan | తెలంగాణ పోలీసులు (Telangana Police) కీలక నిర్ణయం తీసుకున్నారు. తప్పిపోయిన, బాలకార్మిక,...

    Sub collector Kiranmai | ప్రజావాణిలో స్పందించట్లేదని.. సబ్​కలెక్టర్​కు ఫిర్యాదు

    అక్షరటుడే, నిజాంసాగర్‌: Sub collector Kiranmai | తహశీల్దార్‌ కార్యాలయంలో నిర్వహించిన ప్రజావాణిలో ఫిర్యాదు ఇచ్చినా స్పందించకపోవడంతో ఓ...

    Hyderabad | కలుషిత నీరు సరఫరా.. విద్యార్థుల ప్రాణాలతో చెలగాటం

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Hyderabad | ఎన్నో ఆశలతో హైదరాబాద్​ (Hyderabad) నగరంలో చదువుకోవడానికి వచ్చిన విద్యార్థుల ప్రాణాలతో...