అక్షరటుడే, వెబ్డెస్క్: Phone Tapping Case | ఫోన్ ట్యాపింగ్ కేసులో సిట్ అధికారులు విచారణ వేగవంతం చేశారు. బీఆర్ఎస్ హయాంలో ఎస్ఐబీ చీఫ్ ప్రభాకర్రావు(SIB Chief Prabhakar Rao), ప్రణీత్రావు(Praneeth Rao) ఆధ్వర్యంలో వేలాది మంది ఫోన్లు ట్యాప్ చేసినట్లు అధికారులు గుర్తించారు. ఈ కేసులో ఇప్పటికే ప్రభాకర్రావుతో పాటు ప్రణీత్రావును అధికారులు విచారిస్తున్నారు. వారి విచారణలో పలు కీలక ఆధారాలు సేకరించినట్లు సమాచారం.
బీఆర్ఎస్ హయాంలో ప్రతిపక్ష నాయకులతో పాటు సినీ ప్రముఖులు, జడ్జీలు, వ్యాపారులు, జర్నలిస్ట్లు, పలువురు అధికారుల ఫోన్లను ట్యాప్ చేశారు. బీఆర్ఎస్ నాయకుల ఫోన్లు కూడా ట్యాప్ చేయడం గమనార్హం. ఈ క్రమంలో సిట్ అధికారులు ఫోన్ ట్యాపింగ్కు గురైన బాధితుల స్టేట్మెంట్ కూడా రికార్డు చేస్తున్నారు. ఇందులో భాగంగా శుక్రవారం ఆంధ్రజ్యోతి ఎండీ రాధాకృష్ణ(Andhra Jyothi MD Radhakrishna) వాంగ్మూలం సేకరించారు. ఏసీపీ వెంకటగిరి(ACP Venkatagiri) గంట పాటు రాధాకృష్ణ స్టేట్మెంట్ రికార్డు చేశారు.
Phone Tapping Case | చర్యలుంటాయా!
ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో సిట్ అధికారులు(Sit Officers) దూకుడు పెంచారు. నిందితులను విచారించడంతో పాటు బాధితుల స్టేట్మెంట్ రికార్డు చేస్తున్నారు. కాంగ్రెస్కు చెందిన 200 మంది నాయకుల ఫోన్లు ట్యాప్ చేసినట్లు సిట్ గుర్తించింది. అయితే బాధితులు అందరూ కూడా కేసీఆర్(KCR), కేటీఆర్(KTR) చెబితేనే తమ ఫోన్లు ట్యాప్ చేశారని చెబుతున్నారు. మరోవైపు ప్రధాన నిందితుడు ప్రభాకర్ రావు డీజీపీ ఆదేశాల మేరకు ట్యాపింగ్ చేసినట్లు తెలిపినట్లు సమాచారం. ఈ మేరకు గతంలో పని చేసిన డీజీపీని కూడా సిట్ అధికారులు విచారించే అవకాశం ఉంది.
ఫోన్ ట్యాపింగ్(Phone Tapping) వెనక ఉన్నవారిపై చర్యలు తీసుకుంటారా.. లేదా అనేది తెలియాల్సి ఉంది. ఇప్పటికే ప్రభుత్వం చేపట్టిన విద్యుత్ కమిషన్ విచారణ ముందుకు సాగడం లేదు. కాళేశ్వరం కమిషన్(Kaleshwaram Commission) నివేదిక రాలేదు. ఫార్ములా ఈ కార్ రేస్ కేసు విచారణ కూడా నెలలుగా కొనసాగుతోంది. దీంతో ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో కేసీఆర్, కేటీఆర్ను అరెస్ట్ చేయాలని బీజేపీ నాయకులు కోరుతున్నారు. లేదంటే కేసును సీబీఐ(CBI)కి అప్పగించాలని డిమాండ్ చేస్తున్నారు. మరి ఈ కేసులో ప్రభుత్వం ఎలా ముందుకు వెళ్తుందో చూడాలి.