అక్షరటుడే, వెబ్డెస్క్:Kadapa | కడప జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. ఎలక్ట్రిక్ బైక్(Electric Bike) పేలి ఓ మహిళ మృతి చెందింది. ఇంధన దిగుమతులు తగ్గించుకోవడంతో పాటు, కాలుష్య నివారణ కోసం కేంద్ర ప్రభుత్వం(Central Government) ఎలక్ట్రిక్ వాహనాలను ప్రోత్సహిస్తోంది. దీంతో చాలా మంది ఎలక్ట్రిక్ బైక్లు, కార్లు కొనుగోలు చేస్తున్నారు. ప్రభుత్వం రంగ రవాణా సంస్థలు కూడా ఎలక్ట్రిక్ బస్సులను(Electric Buses) కొనుగోలు చేస్తున్నాయి. అయితే ఎలక్ట్రిక్ బైక్లు పేలిపోతుండటంతో వాటిని కొనుగోలు చేసిన వారు ఆందోళన చెందుతున్నారు.
కడప జిల్లా యర్రగుంట్ల మండలం పోట్లదుర్తి గ్రామం(Potladurthi village)లో ఎలక్ట్రిక్ బైక్ పేలిపోయింది. బైక్కు ఛార్జింగ్ పెట్టి పడుకున్నారు. అయితే రాత్రి పూట ఒక్కసారిగా అది పేలిపోయింది. దీంతో పక్కనే నిద్రిస్తున్న వెంకట లక్ష్మమ్మ (62) అనే మహిళా మృతి చెందింది. దీంతో ఎలక్ట్రిక్ బైక్లు వినియోగించే వారు ఆందోళన చెందుతున్నారు. కాగా గతంలో సైతం పలు చోట్ల ఎలక్ట్రిక్ బైక్లు దగ్ధమైన ఘటనలు చోటు చేసుకున్నాయి. దీంతో విద్యుత్ వాహనాల భద్రతపై ఆందోళన నెలకొంది.