అక్షరటుడే, బిచ్కుంద :ACB Raids | అంతర్రాష్ట్ర చెక్పోస్టులో ఏసీబీ అధికారులు సోదాలు (ACB Raids) చేయడం కలకలం రేపింది. కామారెడ్డి(Kamareddy district) జిల్లా మద్నూర్ మండలం సలబత్పూర్ వద్ద మహారాష్ట్ర సరిహద్దులో రవాణా శాఖ ఆధ్వర్యంలో చెక్పోస్టు కొనసాగుతోంది. ఈ చెక్పోస్టులో బుధవారం అర్ధరాత్రి ఏసీబీ అధికారులు తనిఖీలు నిర్వహించారు.
ఏసీబీ డీఎస్పీ శేఖర్(ACB DSP Shekhar goud) ఆధ్వర్యంలో చెక్పోస్టులో సోదాలు చేశారు. ఆ సమయంలో విధుల్లో ఏఎంవీఐ కవితతో పాటు సిబ్బంది, ఇద్దరు ప్రైవేట్ వ్యక్తులు ఉన్నట్లు అధికారులు గుర్తించారు. గతంలో సైతం ఈ చెక్పోస్ట్లో ఏసీబీ అధికారులు దాడులు చేశారు. రాత్రిపూట చెక్పోస్ట్ సిబ్బంది తనిఖీల పేరిట వాహనదారుల నుంచి డబ్బులు వసూలు చేస్తున్నట్లు అధికారులు గుర్తించారు.
చెక్పోస్టులో లెక్కకు మించి నగదు ఉన్నట్లు గుర్తించారు. ఏడాదిలో చెక్పోస్టు(Checkpost)పై రెండుసార్లు దాడులు చేయడం తీవ్ర చర్చకు దారి తీసింది. అయితే గతంలో సైతం తనిఖీల సమయంలో డబ్బు దొరికినా ఎలాంటి చర్యలు చేపట్టలేదు. దీంతో చెక్పోస్ట్ సిబ్బంది భయం లేకుండా వసూళ్లకు పాల్పడుతున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. అయినా రవాణా శాఖ అధికారులు మాత్రం తీరు మార్చుకోవట్లేదు.
ACB Raids | చేతులు తడపాల్సిందే..
మద్నూర్ మండలం(Madnur Mandal)లోని చెక్పోస్టు సిబ్బందిపై అనేక ఆరోపణలు ఉన్నాయి. జాతీయ రహదారి మీదుగా వెళ్లే వాహనదారుల నుంచి డబ్బులు వసూలు చేస్తున్నట్లు పలువురు ఆరోపిస్తున్నారు. భారీ వాహనాలను తనిఖీల పేరిట ఆపి లంచాలు డిమాండ్ చేస్తున్నట్లు సమాచారం. అధికారుల చేతులు తడిపితేనే.. వాహనాలను కదలిస్తున్నట్లు తెలిసింది. ఈ క్రమంలో ఏసీబీ అధికారులు దాడులు చేయడం గమనార్హం. ఈ ఏసీబీ సోదాలకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.