More
    Homeజిల్లాలునిజామాబాద్​DCC Nizamabad | పీసీసీ ప్రధాన కార్యదర్శి రాంభూపాల్​కు సన్మానం

    DCC Nizamabad | పీసీసీ ప్రధాన కార్యదర్శి రాంభూపాల్​కు సన్మానం

    Published on

    అక్షరటుడే, వెబ్​డెస్క్​: DCC Nizamabad | పీసీసీ పదవులను కాంగ్రెస్​ పార్టీ ఇటీవల నియమించిన విషయం తెలిసిందే. ఇందులో భాగంగా నగరానికి చెందిన పీసీసీ ప్రధాన కార్యదర్శి రాంభూపాల్​కు, క్రమశిక్షణ కమిటీ సభ్యుడుగా (PCC Disciplinary Committee) రామకృష్ణకు పదవులు దక్కాయి. ఈ నేపథ్యంలో వారిని జిల్లా కేంద్రంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో సన్మానించారు. డీసీసీ అధ్యక్షుడు మానాల మోహన్ రెడ్డి (Manala Moahan Reddy), కాంగ్రెస్ నగరాధ్యక్షుడు కేశ వేణు(Kesha venu) ఆధ్వర్యంలో ఘనంగా సన్మానించారు.

    ఈ సందర్భంగా కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు మానాల మోహన్ రెడ్డి, కాంగ్రెస్ నగరాధ్యక్షుడు కేశ వేణు మాట్లాడుతూ నిజామాబాద్ జిల్లాకు చెందిన కాంగ్రెస్ నాయకులకు రాష్ట్ర కాంగ్రెస్ పార్టీలో వివిధ పదవులు దక్కడం సంతోషంగా ఉందన్నారు. వారికి పదవులు ఇచ్చినందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, కాంగ్రెస్ పార్టీ అధిష్టానానికి ధన్యవాదాలు తెలిపారు.

    READ ALSO  Registration Department | ఫేక్​ ఎఫ్​ఎంసీతో రిజిస్ట్రేషన్లు.. సహకరిస్తున్న సబ్​ రిజిస్ట్రార్లు

    DCC Nizamabad | కష్టపడ్డ వారికి పదవులు

    కాంగ్రెస్​ పార్టీలో కష్టపడ్డ వారికి పదవులు వస్తాయని మోహన్​రెడ్డి, కేశ్​ వేణు అన్నారు. ఇందుకు నిదర్శనం వారికి పదవులు దక్కడమేనన్నారు. పార్టీ నమ్మకంతో వీరికి పదవులు కట్టబెట్టిందని పేర్కొన్నారు. పార్టీ నమ్మకాన్ని కాపాడుతూ పార్టీని క్షేత్రస్థాయిలో బలోపేతం చేసే విధంగా పనిచేయాలని వారికి సూచించారు.

    ఈ సందర్భంగా రాంభూపాల్, రామకృష్ణ మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ అధిష్టానం మాపై నమ్మకంతో ఈ పదవులు ఇచ్చినందుకు కృతజ్ఞతలు తెలిపారు. రాబోయే రోజుల్లో కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేస్తూ వచ్చే ఎన్నికల్లో పార్టీ విజయం సాధించే విధంగా కృషి చేస్తామని తెలిపారు. కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ ఛైర్మన్​ అంతరెడ్డి రాజారెడ్డి, మార్కెట్ కమిటీ(Market Committee) ఛైర్మన్​ ముప్ప గంగారెడ్డి, సీనియర్ కాంగ్రెస్ నాయకులు రత్నాకర్, జిల్లా యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు విపుల్ గౌడ్, జిల్లా ఎస్సీ సెల్ అధ్యక్షుడు లింగం, జిల్లా సేవాదళ్ నాయకులు సంతోష్, నవాజ్, ప్రీతం, మాజీ ఫ్లోర్ లీడర్ రాజేంద్ర ప్రసాద్, మాజీ కార్పొరేటర్ విజయ, కొండపాక రాజేష్, లవంగ ప్రమోద్ తదితరులు పాల్గొన్నారు.

    READ ALSO  MP Arvind | 29న అమిత్​ షా రాక.. పసుపు బోర్డుతో కొత్త శకం ఆరంభం..: ఎంపీ అర్వింద్​

    రాంభూపాల్​ను సన్మానిస్తున్న మానాల మోహన్​ రెడ్డి, కేశ వేణు తదితరులు

    Latest articles

    Govt Employees | ఉద్యోగుల బదిలీలపై నిషేధం.. కారణం ఇదే..!

    అక్షరటుడే, హైదరాబాద్: Govt Employees : తెలంగాణ ప్రభుత్వం(Telangana state government) కీలక నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వ ఉద్యోగుల...

    Puri Jagannath Rath Yatra | తరిద్దాం శ్రీ కృష్ణుడి సేవలో.. నేడు పూరి జగన్నాథ రథయాత్ర

    అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Puri Jagannath Rath Yatra : శ్రీకృష్ణుడు(Sri Krishna) తన తోబుట్టువులతో కలిసి కొలువుదీరిన మహిమాన్విత...

    Vijay Deverakonda | సక్సెస్, డబ్బు, రెస్పెక్ట్.. ఈ మూడే కిక్ ఇచ్చేవి : విజయ్ దేవరకొండ

    అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Vijay Deverakonda : జీవితంలో ప్రతి ఒక్కరికీ కిక్ ఇచ్చేవి సక్సెస్, మనీ, రెస్పెక్ట్ మాత్రమేనని...

    Indira Canteens | ఇందిరా క్యాంటీన్లుగా అన్నపూర్ణ భోజన కేంద్రాలు.. ఇకపై టిఫిన్ కూడా..

    అక్షరటుడే, హైదరాబాద్: Indira Canteens : తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్ మహా నగరంలో కేవలం రూ.5 కే...

    More like this

    Govt Employees | ఉద్యోగుల బదిలీలపై నిషేధం.. కారణం ఇదే..!

    అక్షరటుడే, హైదరాబాద్: Govt Employees : తెలంగాణ ప్రభుత్వం(Telangana state government) కీలక నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వ ఉద్యోగుల...

    Puri Jagannath Rath Yatra | తరిద్దాం శ్రీ కృష్ణుడి సేవలో.. నేడు పూరి జగన్నాథ రథయాత్ర

    అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Puri Jagannath Rath Yatra : శ్రీకృష్ణుడు(Sri Krishna) తన తోబుట్టువులతో కలిసి కొలువుదీరిన మహిమాన్విత...

    Vijay Deverakonda | సక్సెస్, డబ్బు, రెస్పెక్ట్.. ఈ మూడే కిక్ ఇచ్చేవి : విజయ్ దేవరకొండ

    అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Vijay Deverakonda : జీవితంలో ప్రతి ఒక్కరికీ కిక్ ఇచ్చేవి సక్సెస్, మనీ, రెస్పెక్ట్ మాత్రమేనని...