అక్షరటుడే, ఇందూరు: MP Arvind | జాతీయ పసుపు బోర్డు కేంద్ర (National Turmeric Board) కార్యాలయ ప్రారంభానికి ఈనెల 29న అమిత్ షా (Amit Shah) జిల్లా కేంద్రానికి రానున్నారు.
అనంతరం పాలిటెక్నిక్ మైదానంలో రైతుసభ నిర్వహించనున్నారు. ఈ నేపథ్యంలో సభాస్థలిని బుధవారం ఎంపీ ధర్మపురి అర్వింద్ (MP Dharmapuri Arvind), పసుపు బోర్డు ఛైర్మన్ పల్లె గంగారెడ్డి, ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ గుప్తతో కలిసి పరిశీలించారు. సభ ఏర్పాట్లు భద్రత చర్యలపై సమీక్షించారు. వారి వెంట ఏసీపీ రాజా వెంకట్ రెడ్డి, ఇతర అధికారులు ఉన్నారు. అయితే అమిత్ షా సభ కోసం భారీ జనసమీకరణ చేయనున్నారు. ఇందుకోసం ఇప్పటికే పార్లమెంట్ పరిధిలోని నేతలతో అరవింద్ సమావేశాలు జరిపారు. ప్రత్యేకించి పసుపు రైతులు తరలి రావాలని ఇప్పటికే నిర్ణయించుకున్నారు.
అమిత్ షా ఇందూర్లో పర్యటించే రోజే డి శ్రీనివాస్ ప్రథమ వర్ధంతి. కాగా.. కంటేశ్వర్ చౌరస్తాలో ఏర్పాటు చేసిన డీఎస్ విగ్రహాన్ని అమిత్ షా ఆవిష్కరించనున్నారు. ఎంపీ అర్వింద్ వ్యక్తిగతంగా డీఎస్ విగ్రహాన్ని(DS statue) తయారు చేయించారు. విగ్రహాన్ని కేంద్ర హోం మంత్రి అమిత్ షా చేతుల మీదుగా ప్రారంభిస్తారని ఎంపీ ఇదివరకే తెలిపారు.