అక్షరటుడే, వెబ్డెస్క్: ACB Case | ఫార్ములా ఈ కారు రేసు కేసులో ఏసీబీ విచారణ (ACB investigation) కొనసాగుతోంది. ఈ కేసులో ఇప్పటికే మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ను (KTR) అధికారులు రెండు సార్లు విచారించారు. అంతేగాకుండా పలువురు అధికారులను సైతం విచారించారు. తాజాగా ఓ ఐఏఎస్ అధికారికి (IAS officer) సైతం ఏసీబీ నోటీసులు ఇచ్చింది. హైదరాబాద్లో నిర్వహించిన ఫార్ములా ఈ కారు రేసులో (Formula E car race) అక్రమాలు జరిగాయని ఏసీబీ కేసు నమోదు చేసిన విషయం తెలిసిందే. కేబినెట్ ఆమోదం లేకుండానే అప్పటి మంత్రి కేటీఆర్ నిధులు కేటాయించారని ఏసీబీ పేర్కొంటుంది. నిధుల వినియోగంలో అక్రమాలు జరిగాయని విచారణ చేపడుతోంది. ఈ క్రమంలో తాజాగా ఐఏఎస్ అరవింద్ కుమార్కు (IAS Arvind Kumar) ఏసీబీ నోటీసులు ఇచ్చింది. జులై 1న విచారణకు రావాలని ఆదేశించింది.
ACB Case | విదేశాల్లో అరవింద్ కుమార్
ఫార్ములా ఈ రేసులో ఐఏఎస్ అరవింద్ కీలకంగా వ్యవహరించారు. దీంతో ఇప్పటికే అధికారులు ఆయనను పలుమార్లు విచారించారు. అయితే ఇటీవల కేటీఆర్ను విచారించిన అధికారులు.. ఆయన ఇచ్చిన సమాచారం మేరకు మరోసారి అరవింద్కుమార్ను (Arvind Kumar) విచారించాలని నిర్ణయించారు. ఈ మేరకు ఆయనకు నోటీసులు ఇచ్చారు. అయితే అరవింద్ కుమార్ ప్రస్తుతం విదేశాల్లో ఉన్నారు. కుమార్తె కాన్వొకేషన్ కోసం ఆయన యూరప్ వెళ్లారు. ఈ నెల 30 ఆయన హైదరాబాద్ (Hyderabad) రానున్నట్లు సమాచారం. దీంతో జులై 1న తమ ఎదుట విచారణకు హాజరు కావాలని ఏసీబీ అధికారులు నోటీసులు జారీ చేశారు.