అక్షరటుడే, వెబ్డెస్క్ : Bunkers | పహల్గామ్ ఉగ్రదాడి pahalgam terror attack నేపథ్యంలో భారత్, పాక్ దేశాల్లో యుద్ధ మేఘాలు అలుముకున్నాయి. ఈ దాడి వెనుక పాక్ హస్తం ఉందన్న భారత్ ఆ దేశానికి సింధూ జలాలను indus river ఆపేసిన విషయం తెలిసిందే. పాక్ కూడా సిమ్లా ఒప్పందాన్ని రద్దు చేస్తున్నట్లు ప్రకటించి సరిహద్దుల్లో కాల్పులను ప్రారంభించింది.
మరోవైపు రెండు దేశాలు తమ సైన్యాన్ని సరిహద్దుల్లో భారీగా మొహరించాయి. ఈ క్రమంలో జమ్మూ కశ్మీర్లోని Jammu Kashmir సరిహద్దు గ్రామాల boarder villages ప్రజలు బిక్కుబిక్కుమంటున్నారు. పాకిస్తాన్ ఒకవేళ బాంబులతో దాడులు చేస్తే ఇబ్బంది ఉండకుండా ముందు జాగ్రత్తగా బంకర్లను సిద్ధం చేసుకుంటున్నారు. యుద్ధ సమయాల్లో ప్రజలకు ఇబ్బంది లేకుండా ఉండటానికి కేంద్ర ప్రభుత్వం సరిహద్దు గ్రామాల్లో గతంలో బంకర్లను నిర్మించింది. ప్రస్తుతం ప్రజలు వాటిని శుభ్రం చేసి సిద్ధం చేసుకుంటున్నారు.