అక్షరటుడే, కామారెడ్డి: Rythu Bharosa | రైతు భరోసా(Rythu Bharosa) పథకం కింద జిల్లాలో ఇప్పటివరకు రూ.306.48 కోట్ల నిధులను రైతుల ఖాతాల్లో జమ చేసినట్లు జిల్లా వ్యవసాయ శాఖ అధికారి తిరుమల ప్రసాద్(Tirumala Prasad) తెలిపారు.
జిల్లాలోని 3,03,944 మంది రైతుల ఖాతాల్లో(Farmers Account) ఈ నిధులు జమ అయినట్లు బుధవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. బాన్సువాడ నియోజకవర్గం(Banswada constituency)లో 32,237 మంది రైతులకు రూ.28.03 కోట్లు, జుక్కల్ నియోజకవర్గంలో 94,006 మంది రైతులకు రూ.106.55 కోట్లు, కామారెడ్డి నియోజకవర్గంలో 70,678 మంది రైతులకు రూ.65.54 కోట్లు, ఎల్లారెడ్డి నియోజకవర్గంలో 1,07,023 మంది రైతులకు రూ.106.35 కోట్ల నిధులను రైతుల ఖాతాల్లో జమ చేశామని స్పష్టం చేశారు.