అక్షరటుడే, కామారెడ్డి: Congress Kamareddy | అసెంబ్లీ ఎన్నికలకు ముందు బీఆర్ఎస్ నుంచి సస్పెండ్ చేస్తే కాంగ్రెస్ పార్టీలోకి మారతానన్న సమాచారం తెలుసుకునేందుకు తనతో పాటు అనుచరుల ఫోన్ ట్యాప్ (Phone tap) చేశారని టీపీసీసీ జనరల్ సెక్రెటరీ (TPCC General Secretary) గడ్డం చంద్రశేఖర్ రెడ్డి పేర్కొన్నారు. బుధవారం హైదరాబాద్లోని సిట్ కార్యాలయానికి (SIT office) విచారణకు హాజరయ్యారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. సుమారు రెండు గంటల పాటు తన వివరణ తీసుకున్నారని తెలిపారు. తనతో పాటు పీఏ కరుణాకర్ రెడ్డి, డ్రైవర్ అశోక్, కాంగ్రెస్ నాయకులు అరవింద్ కుమార్ సిట్ ఎదుట హాజరైనట్లు చెప్పారు.
2023 అసెంబ్లీ ఎన్నికల (Assembly elections) సమయంలో కామారెడ్డిలోని తన ఇంట్లో పోలీసులు తరుచూ తనిఖీలు, దాడులు చేశారని పేర్కొన్నారు. అసెంబ్లీ ఎన్నికలకు ముందు బీఆర్ఎస్ (BRS) నుంచి కాంగ్రెస్లో చేరడంతో తన ఫోన్ ట్యాప్ చేశారని వివరించారు. వ్యక్తిగత జీవితాన్ని దెబ్బతీసేలా ఫోన్ ట్యాపింగ్ చేయడం సరికాదన్నారు. ప్రభుత్వం సమగ్ర విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు.