అక్షరటుడే, వెబ్డెస్క్: Rishabh Pant | టీమిండియా బ్యాట్స్మన్, వికెట్ కీపర్ రిషబ్ పంత్ ఐసీసీ ర్యాంకింగ్స్(ICC Rankings)లో అదరగొట్టాడు. ఇంగ్లాండ్తో జరిగిన మొదటి టెస్ట్లో రెండు ఇన్నింగ్స్లలో సెంచరీలతో చెలరేగిన భారత వికెట్ కీపర్ బుధవారం ఐసీసీ ప్రకటించిన ర్యాంకింగ్స్లో ఒక స్థానం మెరుగుపరుచుకొని ఏడో స్థానానికి చేరుకున్నాడు.
ఐపీఎల్లో లక్నో సూపర్ జెయింట్స్ కెప్టెన్(Lucknow Super Giants captain)గా ఉన్న రిషబ్ పంత్ ఘోరంగా విఫలం అయ్యాడు. కేవలం ఒక్క మ్యాచ్లో మాత్రమే సెంచరీ చేశాడు. దీంతో ఇంగ్లాండ్ టూర్లో ఈ వికెట్ కీపర్ ఎలా ఆడుతాడోనని భారత అభిమానులు ఆందోళన చెందారు. అయితే అందరి అనుమానాలను పటాపంచలు చేస్తూ పంత్(Rishabh Pant ) లీడ్స్ వేదికగా జరిగిన తొలి టెస్ట్లో రెండు సెంచరీలు చేశాడు. మొదటి ఇన్నింగ్స్లో 178 బంతుల్లో 134 పరుగులు చేసిన పంత్.. రెండో ఇన్నింగ్స్లో 140 బంతుల్లో 118 పరుగులతో రాణించాడు. ఈ మ్యాచ్లో భారత్ ఓడినా.. పంత్ తన బ్యాట్తో ఆకట్టుకున్నాడు.
Rishabh Pant | 800 పాయింట్లతో రికార్డు
ఇంగ్లాండ్ తొలి టెస్ట్లో రాణించడంతో పంత్ తన కెరీర్లో తొలిసారి ఏడో స్థానానికి చేరుకున్నాడు. టెస్ట్ ర్యాంకింగ్స్లో 800 రేటింగ్ పాయింట్లు(800 rating points) సాధించాడు. అంతేగాకుండా ఈ ఘనత సాధించిన తొలి ఇండియన్ కీపర్గా నిలిచాడు. అయితే ఇంగ్లాండ్ క్రికెటర్ జో రూట్ 889 పాయింట్లతో టెస్ట్ ర్యాంకింగ్స్లో తొలి స్థానంలో నిలిచాడు. ఇంగ్లాండ్ వైస్ కెప్టెన్ హ్యరీ బ్రూక్ 874 పాయింట్లతో రెండో స్థానంలో ఉన్నాడు. న్యూజిలాండ్ బ్యాటర్ కేన్ విలియమ్సన్ 867 పాయింట్లతో మూడో ర్యాంక్లో కొనసాగుతున్నాడు.
భారత యువ క్రికెటర్ 851 పాయింట్లతో నాలుగో స్థానంలో ఉన్నాడు. జైశ్వాల్ ఇంగ్లాండ్తో జరిగిన తొలిటెస్ట్లో మొదటి ఇన్నింగ్స్లో సెంచరీతో రాణించగా.. రెండో ఇన్నింగ్స్లో నాలుగు పరుగులకే వెనుదిరిగాడు. టీమిండియా టెస్ట్ కెప్టెన్ శుబ్మన్ గిల్ ఐదు స్థానాలు ఎగబాకి 20వ స్థానానికి చేరుకున్నాడు. ఇంగ్లాండ్తో రెండో ఇన్నింగ్స్లో 137 పరుగులతో రాణించిన కేఎల్ రాహుల్ ఏకంగా 10 స్థానాలు ఎగబాకి 38వ ర్యాంక్ సాధించాడు. బౌలింగ్లో ఇండియన్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా తొలి స్థానంలో కొనసాగుతున్నాడు.