అక్షరటుడే, ఎల్లారెడ్డి: Yellareddy | మాదకద్రవ్యాల నివారణకు సమష్టిగా కృషి చేయాలని ఎల్లారెడ్డి డీఎస్పీ శ్రీనివాస్ రావు (YellaReddy DSP Srinivas Rao) యువతకు పిలుపునిచ్చారు. జాతీయ మాదకద్రవ్యాల వ్యతిరేక దినోత్సవాన్ని (Anti-Drug Day) పురస్కరించుకొని డ్రగ్స్ నియంత్రణపై బుధవారం అవగాహన ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మాదకద్రవ్యాల అలవాటుతో భవిష్యత్తును నాశనం చేస్తుందన్నారు. ఎంతో మంది తమకు మత్తు పదార్థాలకు అలవాటు పడి కుటుంబీలకు తీరని శోకం మిగులుస్తున్నారన్నారు.
యువత బాగా చదువుకుని జీవితంలో రాణించాలని సూచించారు. బాగా చదివితేనే ఉజ్వల భవిష్యత్తు ఉంటుందని వివరించారు. యువత డ్రగ్స్కు బానిసలుగా మారి వారి కుటుంబీకులను ఇబ్బందుల పాలు చేయవద్దని ఆయన సూచించారు. ఎక్కడైనా మాదక ద్రవ్యాలు విక్రయించినట్లు తెలిసినా, ఎవరైనా తీసుకున్నట్లు తెలిస్తే వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలని చెప్పారు. కార్యక్రమంలో సీఐ రవీంద్ర నాయక్, ఎక్సైజ్ సీఐ షాకీర్, ఎస్సై బొజ్జ మహేష్, మున్సిపల్ కమిషనర్ మహేష్, ప్రభుత్వ ఆస్పత్రి సూపరింటెండెంట్ రవీంద్ర మోహన్, ఎంఈఓ రాజు విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.