More
    HomeతెలంగాణMLC Kavitha | రేవంత్​రెడ్డి గోదావరి నీళ్లను చంద్రబాబుకు గిఫ్ట్​గా ఇచ్చారు.. కవిత సంచలన వ్యాఖ్యలు

    MLC Kavitha | రేవంత్​రెడ్డి గోదావరి నీళ్లను చంద్రబాబుకు గిఫ్ట్​గా ఇచ్చారు.. కవిత సంచలన వ్యాఖ్యలు

    Published on

    అక్షరటుడే, వెబ్​డెస్క్: MLC Kavitha | సీఎం రేవంత్​రెడ్డిపై ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత సంచలన వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ ఆరు గ్యారెంటీలు అమలు చేయాలని తెలంగాణ జాగృతి(Telangana Jagruti) ఆధ్వర్యంలో పోస్టు కార్డు ఉద్యమాన్ని ఆమె ప్రారంభించారు. అబిడ్స్​లోని పోస్ట్​ ఆఫీస్​వద్ద ఆమె సోనియాగాంధీకి పోస్టుకార్డులు పంపారు.

    ఎమ్మెల్సీ కవిత మాట్లాడుతూ.. అసెంబ్లీ సమావేశాలు పెట్టి ఆరు గ్యారెంటీల అమలు, మహిళలకు కాంగ్రెస్ చేసిన మోసం చర్చించాలని డిమాండ్​ చేశారు. మంగళవారం రైతు నేస్తం కార్యక్రమంలో సీఎం రేవంత్​రెడ్డి(CM Revanth Reddy) మాట్లాడుతూ.. బనకచర్లపై అసెంబ్లీ చర్చిద్దామని కేసీఆర్​కు సవాల్​ విసిరిన విషయం తెలిసిందే. దీనిపై కవిత స్పందిస్తూ.. అసెంబ్లీ పెడుదామని.. ఆరు గ్యారెంటీల అమలు, మహిళలను మోసం చేసినదానిపై చర్చిద్దామని డిమాండ్​ చేశారు.

    READ ALSO  DA Hike | విద్యుత్​ ఉద్యోగులకు గుడ్​ న్యూస్​.. డీఏ ప్రకటించిన ప్రభుత్వం

    MLC Kavitha | ప్రజల దృష్టి మరల్చడానికే..

    రేవంత్ రెడ్డి చంద్రబాబు(CM Chandrababu)ను పిలిచి హైదరాబాద్ బిర్యానీ పెట్టి గోదావరి నీళ్లను గిఫ్ట్​గా ఇచ్చారని కవిత ఆరోపించారు. 2016లో పోలవరం, బనకచర్ల అంశమే లేదని పేర్కొన్నారు. సీఎం రేవంత్ రెడ్డికి అబద్దాలు ఆడడం అలవాటైందని కవిత ఆమె ఎద్దేవా చేశారు. గ్యారెంటీలు అమలు చేయకుండా ప్రజల దృష్టిని మళ్లించడం కోసమే కాంగ్రెస్​ అబద్దాలు ప్రచారం చేస్తోందని ఆరోపించారు.

    MLC Kavitha | అందుకే రేవంత్​ సీఎం అయ్యారు..

    కేసీఆర్(KCR) దమ్మెంతా అన్నది ఒరిజినల్ కాంగ్రెస్ పార్టీకి తెలుసని కవిత అన్నారు. అందుకే తెలంగాణ వచ్చిందన్నారు. తెలంగాణ(Telangana) రావడంతోనే ఈ రోజు రేవంత్​రెడ్డి సీఎం అయ్యారని గుర్తు చేశారు. అది మరిచిపోయి మాట్లాడడం బాధాకరమని ఎమ్మెల్సీ అన్నారు. కేసీఆర్ కలలో కూడా తెలంగాణకు నష్టం చేయరని పేర్కొన్నారు.

    READ ALSO  Telangana University | తెయూలో మంగళవారం వన్‌డే సెమినార్‌

    MLC Kavitha | 42 శాతం రిజర్వేషన్లు కల్పించాలి

    స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించాలని కవిత డిమాండ్​ చేశారు. రిజర్వేషన్లు అమలు చేయకుండా ఎన్నికలు నిర్వహిస్తే కాంగ్రెస్ పార్టీ(Congress Party)ని ప్రజలు క్షమించబోరన్నారు. మహిళలకు 2500, పెన్షన్ల మొత్తాన్ని పెంచాలని పోస్టుకార్డుల ఉద్యమం ప్రారంభించినట్లు ఆమె తెలిపారు. ఎమ్మెల్సీ కవిత నేతృత్వంలో సోనియా గాంధీకి వేలాది పోస్టు కార్డులు పంపారు. ఎన్నికల ముందు సోనియా గాంధీ హామీలు ఇవ్వడంతో ప్రజలు ఓట్లు వేశారని కవిత పేర్కొన్నారు. అధికారంలోకి వచ్చి 18 నెలలు అవుతున్నా హామీలు అమలు చేయడం లేదని.. అందుకే సోనియా గాంధీకి పోస్టుకార్డులు పంపుతున్నట్లు ఆమె తెలిపారు.

    Latest articles

    Govt Employees | ఉద్యోగుల బదిలీలపై నిషేధం.. కారణం ఇదే..!

    అక్షరటుడే, హైదరాబాద్: Govt Employees : తెలంగాణ ప్రభుత్వం(Telangana state government) కీలక నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వ ఉద్యోగుల...

    Puri Jagannath Rath Yatra | తరిద్దాం శ్రీ కృష్ణుడి సేవలో.. నేడు పూరి జగన్నాథ రథయాత్ర

    అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Puri Jagannath Rath Yatra : శ్రీకృష్ణుడు(Sri Krishna) తన తోబుట్టువులతో కలిసి కొలువుదీరిన మహిమాన్విత...

    Vijay Deverakonda | సక్సెస్, డబ్బు, రెస్పెక్ట్.. ఈ మూడే కిక్ ఇచ్చేవి : విజయ్ దేవరకొండ

    అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Vijay Deverakonda : జీవితంలో ప్రతి ఒక్కరికీ కిక్ ఇచ్చేవి సక్సెస్, మనీ, రెస్పెక్ట్ మాత్రమేనని...

    Indira Canteens | ఇందిరా క్యాంటీన్లుగా అన్నపూర్ణ భోజన కేంద్రాలు.. ఇకపై టిఫిన్ కూడా..

    అక్షరటుడే, హైదరాబాద్: Indira Canteens : తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్ మహా నగరంలో కేవలం రూ.5 కే...

    More like this

    Govt Employees | ఉద్యోగుల బదిలీలపై నిషేధం.. కారణం ఇదే..!

    అక్షరటుడే, హైదరాబాద్: Govt Employees : తెలంగాణ ప్రభుత్వం(Telangana state government) కీలక నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వ ఉద్యోగుల...

    Puri Jagannath Rath Yatra | తరిద్దాం శ్రీ కృష్ణుడి సేవలో.. నేడు పూరి జగన్నాథ రథయాత్ర

    అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Puri Jagannath Rath Yatra : శ్రీకృష్ణుడు(Sri Krishna) తన తోబుట్టువులతో కలిసి కొలువుదీరిన మహిమాన్విత...

    Vijay Deverakonda | సక్సెస్, డబ్బు, రెస్పెక్ట్.. ఈ మూడే కిక్ ఇచ్చేవి : విజయ్ దేవరకొండ

    అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Vijay Deverakonda : జీవితంలో ప్రతి ఒక్కరికీ కిక్ ఇచ్చేవి సక్సెస్, మనీ, రెస్పెక్ట్ మాత్రమేనని...