More
    HomeతెలంగాణPhone Tapping Case | 15 రోజుల్లో 4,013 ఫోన్ల ట్యాపింగ్​.. సిట్ విచారణలో వెలుగులోకి...

    Phone Tapping Case | 15 రోజుల్లో 4,013 ఫోన్ల ట్యాపింగ్​.. సిట్ విచారణలో వెలుగులోకి సంచలన విషయాలు

    Published on

    అక్షరటుడే, వెబ్​డెస్క్: Phone Tapping Case | రాష్ట్రంలో సంచలనం సృష్టించిన ఫోన్​ ట్యాపింగ్​ వ్యవహారంలో కీలక విషయాలు వెలుగు చూస్తున్నాయి. బీఆర్​ఎస్ హయాంలో రాష్ట్రంలోని ప్రతిపక్ష నేతలతో పాటు, సినీ ప్రముఖులు, వ్యాపారులు, జడ్జీల ఫోన్లు ట్యాప్​ చేసిన విషయం తెలిసిందే. దీంతో కాంగ్రెస్​ అధికారంలోకి వచ్చాక ఫోన్​ ట్యాపింగ్​(Phone Tapping Case)పై కేసు నమోదు చేసింది. ఈ కేసు విచారణకు సిట్​ను ఏర్పాటు చేసింది. సిట్​ అధికారులు ఈ కేసు విచారణలో దూకుడు పెంచారు. ఈ క్రమంలో కీలక విషయాలు వెలుగు చూస్తున్నాయి.

    Phone Tapping Case | ఎన్నికల ముందు రెచ్చిపోయారు..

    బీఆర్​ఎస్​ హయాంలో ఎప్పటి నుంచో ఫోన్లు ట్యాపింగ్​ చేసినట్లు సమాచారం. అయితే అసెంబ్లీ ఎన్నికల ముందు ఎస్​ఐబీ అధికారులు(SIB officers) రెచ్చిపోయారు. ప్రతిపక్ష నేతలతో పాటు వారి అనుచరులు, కుటుంబ సభ్యుల ఫోన్లను ట్యాప్​ చేశారు. రాష్ట్రంలో 2023 నవంబర్​ 30న అసెంబ్లీ ఎన్నికలు జరిగాయి. ఈ క్రమంలో నవంబర్​ 15 నుంచి 30 వరకు 15 రోజుల్లోనే 4,013 ఫోన్లను ట్యాప్​ చేసినట్లు సిట్​ అధికారులు గుర్తించారు. ప్రణీత్ రావు(Praneeth Rao) అండ్ టీమ్ ఫోన్​ ట్యాపింగ్​లో కీలకంగా వ్యవహించారు. 618 మంది పోన్ ట్యాపింగ్ జరిగిందని సమాచారం.

    READ ALSO  Ex Mla Jeevan Reddy | రాష్ట్రంలో కేడీలు, బేడీల పాలన

    Phone Tapping Case | బీఆర్ఎస్​ నేతల ఫోన్లూ ట్యాప్​

    ప్రతిపక్ష నేతలతోపాటు బీఆర్​ఎస్​ నేతల ఫోన్లు కూడా ట్యాప్​ చేసినట్లు సిట్​ అధికారులు వెల్లడించారు. ఇప్పటికే ఫోన్​ట్యాపింగ్​ నిందితులతో పాటు బాధితుల స్టేట్​మెంట్లను కూడా సిట్​ రికార్డు చేస్తోంది. ముఖ్యంగా రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) ఆయన కుటుంబ సభ్యులు, బండి సంజయ్ కుటుంబ సభ్యులు, ఈటల రాజేందర్ ఆయన కుటుంబ సభ్యులు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి(Ponguleti Srinivasa Reddy) కుటుంబ సభ్యులతో పాటు అనుచరుల ఫోన్లు ట్యాప్ అయినట్లు సమాచారం. అంతేగాకుండా మైనంపల్లి హనుమంత్ రావు, మాజీ ఎమ్మెల్యే కేఎస్​రత్నం, మర్రి శశిధర్ రెడ్డి, బీఆర్ఎస్ నేతలు, మాజీ ఎమ్మెల్యేలు, పద్మా దేవేందర్ రెడ్డి , మర్రి జనార్దన్​ రెడ్డి, తాటికొండ రాజయ్య ఫోన్లు కూడా ట్యాప్​ అయినట్లు తెలుస్తోంది. దీంతో త్వరలో వీరికి నోటీసులు ఇచ్చి స్టేట్​మెంట్ రికార్డు చేయాలని సిట్(Sit) యోచిస్తోంది. కాగా.. ఇప్పటి వరకు 228 మంది వాంగ్మూలాలను అధికారులు నమోదు చేశారు.

    READ ALSO  Harish Rao | కాంగ్రెస్ పాలనలో తెలంగాణ అస్తవ్యస్తం.. మాజీ మంత్రి హరీశ్ రావు ధ్వజం

    Phone Tapping Case | విచారణ వేగవంతం

    ఫోన్​ ట్యాపింగ్​ కేసులో సిట్​ అధికారులు విచారణ వేగవంతం చేశారు. ఈ కేసులో ప్రధాన నిందితుడు ప్రభాకర్​రావుతో పాటు ఏ2 ప్రణీత్​రావును వరుసగా విచారిస్తున్నారు. వారి నుంచి కీలక సమాచారం రాబట్టినట్లు తెలుస్తోంది. ప్రధాన నిందితుడు, అప్పటి ఎస్​ఐబీ చీఫ్​ ప్రభాకర్​రావు(SIB Chief Prabhakar Rao) ఫోన్​ ట్యాపింగ్​ కేసు నమోదైన వెంటనే అమెరికా పారిపోయి ఇటీవల తిరిగి వచ్చిన విషయం తెలిసిందే. ఆయనకు జులై 5 వరకు అరెస్ట్​ నుంచి సుప్రీంకోర్టు(Supreme Court) రక్షణ కల్పించింది. ఆ తర్వాత ఆయనను అరెస్ట్​ చేసే అవకాశం ఉన్నట్లు సమాచారం. ఇప్పటికే ఏ2 ప్రణీత్​రావును పోలీసలు అరెస్ట్​ చేశారు.

    Latest articles

    AP Tourism | ఏపీలో టూరిజం అభివృద్ధికి కొత్త హోటళ్లు

    అక్షరటుడే, వెబ్​డెస్క్:AP Tourism | ఆంధ్రప్రదేశ్​ ప్రభుత్వం అమరావతి(Amaravati)లో రాజధాని పనులు వేగవంతం చేసింది. అమరావతి నగరంలో సకల...

    Rain Alert | రాష్ట్రానికి వర్ష సూచన

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Rain Alert | రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో శుక్రవారం వర్షం (Rain) పడే అవకాశం...

    Indian Brands | ఎంసీ ఫస్ట్‌.. రాయ‌ల్ స్ట‌గ్ సెకండ్‌.. ప్ర‌పంచ మ‌ద్యం విక్ర‌యాల్లో భార‌త బ్రాండ్ల హ‌వా

    అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Indian Brands : భార‌తీయ విస్కీ బ్రాండ్లు ప్ర‌పంచ మార్కెట్ల‌ను శాసిస్తున్నాయి. ప్ర‌పంచ వ్యాప్తంగా అత్య‌ధికంగా...

    Puri Jagannath | భక్తుల కోసం మూలవిరాట్టే కదిలొచ్చే.. పూరి జగన్నాథ రథయాత్ర విశేషలివే..

    అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Puri Jagannath : ఆషాఢ శుద్ధ విదియ(Ashadha Shuddha Vidiya)నాడు పూరీ క్షేత్రంలో అంగరంగ వైభవంగా...

    More like this

    AP Tourism | ఏపీలో టూరిజం అభివృద్ధికి కొత్త హోటళ్లు

    అక్షరటుడే, వెబ్​డెస్క్:AP Tourism | ఆంధ్రప్రదేశ్​ ప్రభుత్వం అమరావతి(Amaravati)లో రాజధాని పనులు వేగవంతం చేసింది. అమరావతి నగరంలో సకల...

    Rain Alert | రాష్ట్రానికి వర్ష సూచన

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Rain Alert | రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో శుక్రవారం వర్షం (Rain) పడే అవకాశం...

    Indian Brands | ఎంసీ ఫస్ట్‌.. రాయ‌ల్ స్ట‌గ్ సెకండ్‌.. ప్ర‌పంచ మ‌ద్యం విక్ర‌యాల్లో భార‌త బ్రాండ్ల హ‌వా

    అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Indian Brands : భార‌తీయ విస్కీ బ్రాండ్లు ప్ర‌పంచ మార్కెట్ల‌ను శాసిస్తున్నాయి. ప్ర‌పంచ వ్యాప్తంగా అత్య‌ధికంగా...