అక్షరటుడే, వెబ్డెస్క్: Abhinandan Varthaman | పాకిస్తాన్కు చెందిన మేజర్ మోయిజ్ అబ్బాస్ షా(Pak Major Moiz Abbas Shah) ఎన్కౌంటర్లో హతమయ్యాడు. 2019 బాలకోట్ వైమానిక దాడుల తర్వాత భారత వైమానిక దళ వింగ్ కమాండర్ అభినందన్ వర్థమాన్ను బంధించానని చెప్పుకున్న 37 ఏళ్ల అబ్బాస్ షా.. దక్షిణ వజీరిస్తాన్ ప్రాంతంలో తెహ్రీక్-ఇ-తాలిబాన్ పాకిస్తాన్(Tehreek-e-Taliban Pakistan) తో జరిగిన ఎన్కౌంటర్లో మృతి చెందాడు. సైన్యంలోని ఎలైట్ స్పెషల్ సర్వీస్ గ్రూప్ (SSG) సభ్యుడైన చక్వాల్కు చెందిన షా.. ఉగ్రవాద వ్యతిరేక ఆపరేషన్కు నాయకత్వం వహిస్తూ కాల్పుల్లో మరణించాడు. ఈ విషయాన్ని పాకిస్తాన్ సైన్యం(Pakistan Army) ధ్రువీకరించింది. పాక్లో నెలకొన్న అస్థిరతకు తాజా ఎన్కౌంటర్ నిదర్శనంగా నిలిచింది. వేర్పాటువాదులు, ఉగ్రవాదులు దాయాదికి నిద్ర లేకుండా చేస్తున్నారు.
2007లో పాకిస్తాన్ సైన్యం ఇస్లామాబాద్లోని లాల్ మసీదు (రెడ్ మసీదు)ను ముట్టడించడమే టీటీపీ ఆవిర్భావానికి కారణమైంది. అప్పటి నుంచి స్థానికుల మద్దతుతో పాటు జైషే మహమ్మద్(Jaish-e-Mohammed) సహకారంతో బలపడింది. పాకిస్తాన్ షియా జనాభాను లక్ష్యంగా చేసుకుంటే టీటీఎఫ్ దాడులకు పాల్పడుతోంది. ఒక్క 2025లోనే టీటీపీ దాడుల్లో 116 మంది సైనికులు హతమయ్యారు. అంతకు ముందు సంవత్సరం 1,200 మంది బలయ్యారు.
Pak Major Abbas Shah | పాక్కు పట్టుబడిన అభినందన్
2019లో పుల్వామా ఉగ్రవాద దాడి తర్వాత ఇండియా-పాక్ ప్రతిష్టంభన సమయంలో మేజర్ షా అందరి దృష్టిని ఆకర్షించాడు. బాలాకోట్ వైమానిక దాడుల తర్వాత పాక్ ఇండియాపై దాడికి యత్నించింది. ఈ క్రమంలో వింగ్ కమాండర్ అభినందన్ వర్థమాన్(Wing Commander Abhinandan Varthaman) మిగ్-21 బైసన్ జెట్లో దాయాది విమానాలను వెంబడించాడు. ఈక్రమంలో పాకిస్తాన్ వైమానిక దళ జెట్లతో జరిగిన డాగ్ఫైట్లో ఆయన కూలిపోయి పాకిస్తాన్ ఆక్రమిత భూభాగంలో సురక్షితంగా దిగాడు. దీంతో పాక్ సైన్యం ఆయనను బంధించింది. ఈ వ్యవహారంలో తనదే కీలక పాత్ర అని ప్రచారం చేసుకున్న షా ఇప్పుడు టీటీఎఫ్తో జరిగిన కాల్పుల్లో హతమయ్యాడు.