అక్షరటుడే, హైదరాబాద్: Passport Day : దేశ రాజధాని ఢిల్లీ(national capital Delhi)లో మంగళవారం(జూన్ 24) జరిగిన ప్రాంతీయ పాస్పోర్టు అధికారుల సమావేశం-2025లో హైదరాబాద్ ప్రాంతీయ పాస్పోర్టు కార్యాలయాని(Hyderabad Regional Passport Office)కి అరుదైన గుర్తింపు దక్కింది. 2024-25లో చేపట్టిన సంస్కరణలు, ప్రజాసేవ పట్ల చూపిన నిబద్ధత విభాగంలో హైదరాబాద్ రీజినల్ పాస్పోర్టు ఆఫీస్(ఆర్పీవో) పురస్కారం సొంతం చేసుకుంది.
ఈ మేరకు 13వ పాస్పోర్టు సేవా దివస్(13th Passport Seva Diwas)లో విదేశాంగ శాఖ సహాయ మంత్రి పవిత్ర మార్గెరిటా(Minister of State for External Affairs Pavitra Margherita) ఈ పురస్కారం ప్రదానం చేశారు. హైదరాబాద్ ప్రాంతీయ పాస్పోర్ట్ అధికారి జొన్నలగడ్డ స్నేహజ (Jonnalagadda Snehaja) ఈ అవార్డు అందుకున్నారు. దీనికితోడు పాస్పోర్ట్ ధ్రువీకరణ(వెరిఫికేషన్), సేవా సౌకర్యాలలో నిరంతరం ప్రతిభ కనబర్చిన తెలంగాణ పోలీసులను సైతం ఇదే వేదికపై సత్కరించారు. ఈ పురస్కారాన్ని తెలంగాణ పోలీసు (Telangana Police) తరఫున ఇంటెలిజెన్స్ డీజీ బత్తుల శివధర్రెడ్డి (Intelligence DG Bathula Shivdhar Reddy) స్వీకరించారు.