More
    HomeతెలంగాణRythu Bharosa | ఆ జిల్లా రైతులకు పడని రైతు భరోసా.. ఎందుకో తెలుసా?

    Rythu Bharosa | ఆ జిల్లా రైతులకు పడని రైతు భరోసా.. ఎందుకో తెలుసా?

    Published on

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Rythu Bharosa | రాష్ట్ర ప్రభుత్వం ఎన్నాడు లేనివిధంగా ఈ వానాకాలం సీజన్​కు సంబంధించి రైతు భరోసా (Rythu Bharosa)ను వేగంగా రైతుల (Farmers) ఖాతాల్లో జమ చేసింది.

    ఇప్పటివరకు రూ.9 వేల కోట్లను తొమ్మిది రోజుల్లో అన్నదాతలకు అందజేసింది. ఎకరాలతో సంబంధం లేకుండా అందరు రైతులకు పెట్టుబడి సాయం అందించింది. అయితే రంగారెడ్డి (Rangareddy) జిల్లాలోని పలువురు రైతులకు మాత్రం మొండిచేయ్యి చూపింది. దీంతో వారు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తమకు రైతుభరోసా జమ చేయాలని కోరుతున్నారు. రైతులకు మద్దతుగా బీఆర్​ఎస్ (BRS) ఆందోళనకు సిద్ధం అవుతోంది.

    రంగారెడ్డి జిల్లాలోని ఔటర్​ రింగ్​ రోడ్డు (ORR) లోపల గల మండలాలకు ప్రభుత్వం రైతు భరోసా జమ చేయలేదు. బాలాపూర్, అబ్దుల్లాపూర్, రాజేందర్‌నగర్, మహేశ్వరం, ఇబ్రహీంపట్నం, శంషాబాద్, హయత్‌నగర్‌‌తో పాటుగా మరి కొన్ని మండలాల్లోని రైతులకు ప్రభుత్వం రైతు భరోసా రద్దు చేసింది. దీంతో వారు ఆందోళన చెందుతున్నారు.

    READ ALSO  Govt Employees | ఉద్యోగుల బదిలీలపై నిషేధం.. కారణం ఇదే..!

    Rythu Bharosa | కూరగాయల సాగు

    ఓఆర్​ఆర్​ లోపల గల మండలాల రైతులు ఎక్కువగా ఆకు కూరలు, కూరగాయలు సాగు చేస్తారు. అయితే తమకు రైతు భరోసా జమ కాకపోవడంతో వారు ఆందోళన చెందుతున్నారు. కూరగాయల సాగు వ్యవసాయం కిందకు రాదా? అని ప్రశ్నిస్తున్నారు. తమకు పెట్టుబడి ఉండదా అంటున్నారు. రైతు భరోసా జమ చేసి ఆదుకోవాలని కోరుతున్నారు.

    Rythu Bharosa | రేపటిలోగా జమ చేయాలి

    ఓఆర్​ఆర్​ లోపల గల రైతులకు బుధవారం సాయంత్రంలోగా రైతు భరోసా జమ చేయాలని బీఆర్​ఎస్​ నాయకుడు పట్లోళ్ల కార్తీక్​రెడ్డి (Patlolla Karthik Reddy ) డిమాండ్​ చేశారు. లేదంటే నిరాహార దీక్ష చేస్తానని ఆయన ప్రకటించారు. రంగారెడ్డి జిల్లా రాష్టానికి ఆర్థిక వెన్నెముక అన్నారు. జిల్లా రైతుల ఎన్నో త్యాగాల చేయటంతో రాష్టానికి ఆర్థిక వనరులు సమకూరాయని ఆయన పేర్కొన్నారు. ఔటర్ రింగ్ రోడ్డు లోపల ఉన్న రైతులకు రైతు భరోసా ఇవ్వకుండా కాంగ్రెస్ పార్టీ అవమానించిందన్నారు.

    READ ALSO  Traffic Police | ఒకే బైక్​పై 8 మంది యువకుల హల్​చల్​.. ఆ తర్వాత ఏం జరిగిందంటే..

    Rythu Bharosa | మంత్రి కీలక ప్రకటన

    ఔటర్​ రింగ్​ రోడ్డు లోపల సాగు చేయని భూములు అధికంగా ఉండటతో రైతు భరోసా నిలిపి వేసినట్లు ఇటీవల మంత్రి తుమ్మల నాగేశ్వర రావు (Minister Tummala Nageshwara rao) తెలిపారు. ఔటర్​ లోపల ఉన్న 2.13 లక్షల ఎకరాల భూముల్లో 93 వేల ఎకరాల వరకు రియల్ ఎస్టేట్ వెంచర్లు, సాగుకు అనువైనవి కాని భూములుగా గుర్తించామన్నారు. పంటలు సాగు చేస్తున్న 1.20 లక్షల ఎకరాలకు రెండు మూడు రోజుల్లో రైతు భరోసా జమ చేస్తామని ఆయన తెలిపారు. రైతులు ఆందోళన చెందవద్దని, ఈ విషయాన్ని బీఆర్​ఎస్​ రాజకీయ లబ్ధి కోసం వాడుకుంటోందని విమర్శించారు.

    Latest articles

    Panchangam | శుభమస్తు.. నేటి పంచాంగం

    తేదీ – 27 జూన్​ 2025శ్రీ విశ్వావసు నామ సంవత్సరంవిక్రమ సంవత్సరం – 2081 పింగళఉత్తరాయణంగ్రీష్మ రుతువురోజు – శుక్రవారంమాసం – ఆషాఢపక్షం...

    Govt Employees | ఉద్యోగుల బదిలీలపై నిషేధం.. కారణం ఇదే..!

    అక్షరటుడే, హైదరాబాద్: Govt Employees : తెలంగాణ ప్రభుత్వం(Telangana state government) కీలక నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వ ఉద్యోగుల...

    Puri Jagannath Rath Yatra | తరిద్దాం శ్రీ కృష్ణుడి సేవలో.. నేడు పూరి జగన్నాథ రథయాత్ర

    అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Puri Jagannath Rath Yatra : శ్రీకృష్ణుడు(Sri Krishna) తన తోబుట్టువులతో కలిసి కొలువుదీరిన మహిమాన్విత...

    Vijay Deverakonda | సక్సెస్, డబ్బు, రెస్పెక్ట్.. ఈ మూడే కిక్ ఇచ్చేవి : విజయ్ దేవరకొండ

    అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Vijay Deverakonda : జీవితంలో ప్రతి ఒక్కరికీ కిక్ ఇచ్చేవి సక్సెస్, మనీ, రెస్పెక్ట్ మాత్రమేనని...

    More like this

    Panchangam | శుభమస్తు.. నేటి పంచాంగం

    తేదీ – 27 జూన్​ 2025శ్రీ విశ్వావసు నామ సంవత్సరంవిక్రమ సంవత్సరం – 2081 పింగళఉత్తరాయణంగ్రీష్మ రుతువురోజు – శుక్రవారంమాసం – ఆషాఢపక్షం...

    Govt Employees | ఉద్యోగుల బదిలీలపై నిషేధం.. కారణం ఇదే..!

    అక్షరటుడే, హైదరాబాద్: Govt Employees : తెలంగాణ ప్రభుత్వం(Telangana state government) కీలక నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వ ఉద్యోగుల...

    Puri Jagannath Rath Yatra | తరిద్దాం శ్రీ కృష్ణుడి సేవలో.. నేడు పూరి జగన్నాథ రథయాత్ర

    అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Puri Jagannath Rath Yatra : శ్రీకృష్ణుడు(Sri Krishna) తన తోబుట్టువులతో కలిసి కొలువుదీరిన మహిమాన్విత...