More
    HomeతెలంగాణCM Revanth | రూ.తొమ్మిది వేల కోట్ల రైతు భరోసా జమ చేశాం: సీఎం రేవంత్​రెడ్డి

    CM Revanth | రూ.తొమ్మిది వేల కోట్ల రైతు భరోసా జమ చేశాం: సీఎం రేవంత్​రెడ్డి

    Published on

    అక్షరటుడే, వెబ్​డెస్క్: CM Revanth | రాష్ట్రంలోని రైతుల ఖాతాల్లో తొమ్మిది రోజుల్లోనే రూ.9 వేల కోట్ల రైతు భరోసా (Rythu Bharosa) జమ చేశామని సీఎం రేవంత్​రెడ్డి (CM Revanth Reddy) తెలిపారు. రైతు భరోసా విజయవంతంగా జమ చేసిన సందర్భంగా మంగళవారం సచివాలయం ఎదురుగా రాజీవ్‌గాంధీ విగ్రహం వద్ద రైతు నేస్తం (Rythu Nestham) కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడారు.

    CM Revanth | వ్యవసాయాన్ని పండుగ చేశాం

    భూమి చుట్టూనే తెలంగాణలో పోరాటాలు జరిగాయని సీఎం గుర్తు చేశారు. వ్యవసాయం దండగ అనే పరిస్థితి నుంచి.. వ్యవసాయం పండుగ అనే పరిస్థితికి తీసుకొచ్చామమన్నారు. రైతులకు ఉచిత విద్యుత్ అందించింది కాంగ్రెస్సే అని ఆయన పేర్కొన్నారు. తమ ప్రభుత్వం మొదటి ప్రాధాన్యం రైతులేనన్నారు. ఎన్నికల ముందు కేసీఆర్ (KCR) ఎగ్గొట్టిన రైతు బంధు (Rythu Bandhu) నిధులను కూడా తాము అధికారంలోకి వచ్చాక ఇచ్చామని చెప్పారు. ఇబ్బందులు ఉన్నా రైతులకు రూ. 2 లక్షల రుణమాఫీ చేశామన్నారు. వరి వేసుకుంటే ఉరి అని కేసీఆర్ అన్నారని, తాము మాత్రం సన్నవడ్లకు బోనస్ ఇస్తున్నట్లు రేవంత్​రెడ్డి పేర్కొన్నారు.

    READ ALSO  Rain Alert | రాష్ట్రానికి భారీ వర్ష సూచన

    CM Revanth | ప్రాజెక్ట్​లు పూర్తి చేయలేదు

    పదేళ్లలో బీఆర్ఎస్‌ (BRS) ప్రభుత్వం ఏ సాగునీటి ప్రాజెక్టును చేపట్టలేదని రేవంత్​రెడ్డి విమర్శించారు. పేరు మార్చి, ఊరు మార్చి.. కాళేశ్వరం కట్టి రూ.లక్ష కోట్ల దోపిడీకి పాల్పడిందని ఆరోపించారు. ఇప్పుడు కాళేశ్వరం.. కూలేశ్వరం అయిందని ఎద్దేవా చేశారు. పదేళ్లలో కల్వకుర్తి, బీమా, సీతారామ, ఇందిరాసాగర్‌.. ఇలా ఏ ప్రాజెక్టును కూడా కేసీఆర్‌ పూర్తి చేయలేదని మండిపడ్డారు. ‘బనకచర్లపై శాసనసభలో చర్చ పెడదాం.. మొత్తం వివరాలతో నేను సభకు వస్తా.. నువ్వు వస్తావా’’.. అని మాజీ సీఎం కేసీఆర్​కు సవాల్​ విసిరారు.

    CM Revanth | వాళ్లు సంపన్నులు ఎలా అయ్యారు?

    బీఆర్​ఎస్​ ప్రభుత్వం పదేళ్లలో రాష్ట్రాన్ని దివాళా తీయించిందని సీఎం ఆరోపించారు. రూ.8 లక్షల కోట్ల అప్పులు చేశారన్నారు. రాష్ట్రం దివాళా తీసినా.. కేసీఆర్‌, కేటీఆర్‌, హరీశ్‌రావు ఎలా సంపన్నులు అయ్యారని ప్రశ్నించారు. వారికి ఫామ్‌హౌస్‌లు ఎలా వచ్చాయన్నారు.

    READ ALSO  Bandi Sanjay | కేసీఆర్​ ఢిల్లీలో మూటలు అప్పజెప్పారు.. బండి సంజయ్​ సంచలన వ్యాఖ్యలు

    CM Revanth | మహిళల అభివృద్ధికి చర్యలు

    కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేయడమే ప్రభుత్వ ధ్యేయమని ముఖ్యమంత్రి పేర్కొన్నారు. మహిళా సంఘాల ఆధ్వర్యంలో సౌర విద్యుత్​ ప్లాంట్లు ఏర్పాటు చేస్తామన్నారు. మహిళలకు రూ.21వేల కోట్ల వడ్డీలేని రుణాలు ఇచ్చి ఆదుకున్నామని చెప్పారు. మహిళా సంఘాల సభ్యులు బస్సులు కొనుగోలు చేసి ఆర్టీసీకి అద్దెకు ఇచ్చేలా చర్యలు తీసుకున్నట్లు తెలిపారు. ఇప్పటికే పలు బస్సులను కొనుగోలు చేయించామని చెప్పారు.

    Latest articles

    Private Schools | పాఠశాలలో బుక్స్​ విక్రయం.. సీజ్​ చేసిన ఎంఈవో

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Private Schools | నిజామాబాద్​ (Nizamabad) నగరంలోని ఓ ప్రైవేట్​ పాఠశాలల్లో నిబంధనలకు విరుద్ధంగా...

    Shabbir Ali | ప్రజలను రెచ్చగొట్టి అధికారంలోకి వచ్చే యోచనలో బీజేపీ

    అక్షరటుడే, కామారెడ్డి: Shabbir Ali | ప్రజలను రెచ్చగొట్టి అధికారంలోకి వచ్చేందుకు బీజేపీ ప్రయత్నిస్తోందని ప్రభుత్వ సలహాదారు షబ్బీర్...

    Hydraa | హైడ్రా పేరిట బెదిరింపులు.. ఇద్దరి అరెస్ట్​

    అక్షరటుడే, వెబ్​డెస్క్: Hydraa | హైదరాబాద్ (Hyderabad)​ నగరంలో చెరువులు, ప్రభుత్వ స్థలాల పరిరక్షణ కోసం ప్రభుత్వం హైడ్రా...

    TNGO’s Nizamabad | రాష్ట్ర టీఎన్జీవోస్ సేవలు అభినందనీయం ​

    అక్షరటుడే, నిజామాబాద్​సిటీ: TNGO's Nizamabad | ఉద్యోగుల పక్షాన పోరాడుతున్న టీఎన్జీవోస్​ రాష్ట్రశాఖ సేవలు అభినందనీయమని టీఎన్జీవోస్ జిల్లా...

    More like this

    Private Schools | పాఠశాలలో బుక్స్​ విక్రయం.. సీజ్​ చేసిన ఎంఈవో

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Private Schools | నిజామాబాద్​ (Nizamabad) నగరంలోని ఓ ప్రైవేట్​ పాఠశాలల్లో నిబంధనలకు విరుద్ధంగా...

    Shabbir Ali | ప్రజలను రెచ్చగొట్టి అధికారంలోకి వచ్చే యోచనలో బీజేపీ

    అక్షరటుడే, కామారెడ్డి: Shabbir Ali | ప్రజలను రెచ్చగొట్టి అధికారంలోకి వచ్చేందుకు బీజేపీ ప్రయత్నిస్తోందని ప్రభుత్వ సలహాదారు షబ్బీర్...

    Hydraa | హైడ్రా పేరిట బెదిరింపులు.. ఇద్దరి అరెస్ట్​

    అక్షరటుడే, వెబ్​డెస్క్: Hydraa | హైదరాబాద్ (Hyderabad)​ నగరంలో చెరువులు, ప్రభుత్వ స్థలాల పరిరక్షణ కోసం ప్రభుత్వం హైడ్రా...