అక్షరటుడే, వెబ్డెస్క్: NEET – IIT Training | బీసీ విద్యార్థులకు NEET, IIT అవకావశాలు కల్పించే దిశగా కీలక అడుగు పడింది. బీసీ గురుకుల విద్యా సంస్థల బోర్డు ఆఫ్ గవర్నెన్స్ ఇటీవల నిర్వహించిన సమావేశంలో రెండు స్కూల్ ఆఫ్ ఎక్స్లెన్స్ కేంద్రాలను ఏర్పాటు చేయాలని నిర్ణయించడంతో విద్యార్థులకు ఉచితంగా NEET, IIT శిక్షణ అందించేందుకు మార్గం సుగమమైంది. ఎంజేపీ జూనియర్ కళాశాల విద్యార్థులకు ఉచితంగా పాఠ్య పుస్తకాలు అందజేయనున్నట్టు రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి ఎస్.సవిత(BC Welfare Minister S. Savita) తెలిపారు. 13 ఉమ్మడి జిల్లాల్లో డిస్ట్రిక్ట్ కో–ఆర్డినేటర్ పోస్టులు కూడా భర్తీ చేయనున్నట్లు వెల్లడించారు. ఆర్ట్, క్రాఫ్ట్, సంగీత టీచర్లకు టీజీటీ స్కేల్ వర్తింపజేయనున్నామన్నారు. ఆర్థిక, ఆర్థికేతర సంబంధమైన 36 అంశాలపై చర్చించి, కీలక నిర్ణయాలు తీసుకున్నారు. కొన్ని అంశాలను సీఎం చంద్రబాబు దృష్టికి తీసుకెళ్లాలని నిర్ణయించగా, మరికొన్ని అంశాలపై ఆమోదం తెలిపారు.
NEET – IIT Training | కీలక అంశాలు..
ముందుగా టెన్త్, ఇంటర్ ఫలితాల్లో అత్యుత్తమ ఫలితాలు సాధించడంపై సిబ్బందిని మంత్రి సవిత(Minister Savita) ప్రశంసించారు. ప్రస్తుత విద్యా సంవత్సరంలోనూ మరింత పర్సంటేజీ సాధించేలా ఇప్పటి నుంచే ప్రణాళికులు సిద్ధం చేసుకోవాలని దిశా నిర్దేశం చేశారు. ఎంజేపీ స్కూల్లో(MJP School) పనిచేస్తున్న స్టాఫ్ నర్స్, ఆర్ట్, క్రాఫ్ట్, సంగీత టీచర్లకు కూటమి ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. స్టాఫ్ నర్స్, ఆర్ట్, క్రాఫ్ట్, సంగీత టీచర్లకు దశలవారీగా టీజీటీ స్కేల్ అందజేయాలని ఎంజేపీ గురుకుల విద్యా సంస్థల సొసైటీ బోర్డు ఆఫ్ గవర్నెర్స్ సమావేశంలో ఆమోదం తెలిపారు. ఏంజేపీ MJP విద్యా సంస్థల్లో చదువుతూ ప్రమాదవశాత్తు ఎవరైనా విద్యార్థి మరణిస్తే బాధిత కుటుంబానికి అండగా నిలవాలని బోర్డు ఆఫ్ గవర్నెస్(Board of Governance) సమావేశంలో నిర్ణయించారు. రూ.3 లక్షల నష్టపరిహారంతో పాటు దహన సంస్కారాలకు రూ.10 వేలు అందించాలని సమావేశంలో చర్చించారు. ఈ విషయాన్ని సీఎం చంద్రబాబు(CM Chandrababu) దృష్టికి తీసుకెళ్లి అనుమతులు తీసుకుంటామని మంత్రి సవిత తెలిపారు.
ఎంజేపీ కళాశాలల్లో చదివే బీసీ విద్యార్థులకు(BC students) ఉచితంగా పాఠ్యపుస్తకాలు, షూస్ అందజేయాలని సమావేశంలో నిర్ణయించారు. కళాశాల, పాఠశాల విద్యార్థులకు నైట్ డ్రెస్(Night Dresses) లు కూడా అందజేయనున్నారు. స్పోర్ట్స్ కిట్లు(Sports Kits) కూడా ఇవ్వడానికి గల సాధ్యాసాధ్యాలపై చర్చించారు. ఎంజేపీలో ఇంటర్ చదివే విద్యార్థులకు నీట్, ఐఐటీలో శిక్షణ ఇవ్వాలని సమావేశంలో నిర్ణయించారు. ఇందుకుగాను రాష్ట్రంలో రెండు స్కూల్ ఆఫ్ ఎక్స్ లెన్స్ సెంటర్లను(School of Excellence Centers) ఏర్పాటుపై చర్చించారు. సీబీఎస్ఈ విద్యాబోధన సాగిస్తున్న 24 ఎంజేపీ కళాశాల్లో అవసరమైన ల్యాబ్లతో పాటు మౌలిక వసతుల కల్పనపైనా చర్చించారు. అత్యధిక మంది విద్యార్థులు ఉండే ఎంజేపీల్లో సెకండ్ పీఈటీలను కూడా నియామకంపైనా, రాష్ట్రంలో రెండు బీసీ హాస్టళ్లను జూనియర్ కళాశాలలుగా అప్ గ్రేడ్ చేయడంపైనా చర్చించారు. ఈ అంశాలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలని సమావేశంలో చర్చించారు.