అక్షరటుడే, వెబ్డెస్క్:Weather Updates | రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో మంగళవారం వర్షం పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ (Meteorological Department) తెలిపింది.
నేడు మధ్యాహ్నం నుంచి తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని పేర్కొంది. ఆదిలాబాద్, ఆసిఫాబాద్, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, పెద్దపల్లి, మంచిర్యాల, భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి, ఖమ్మం జిల్లాల్లో వర్షాలు పడుతాయని అధికారులు తెలిపారు. మిగతా ప్రాంతాల్లో సాయంత్రం చెదురు ముదురు వానలకు అవకాశం ఉందన్నారు. 30–40 కి.మీ. వేగంతో ఈదురు గాలులు వీస్తాయని హెచ్చరించారు.
Weather Updates | అయోమయంలో రైతులు
రాష్ట్రంలో మే 20 నుంచి 30 మధ్య భారీ వర్షాలు(Heavy Rains) కురిశాయి. రుతు పవనాలు కూడా ఈ ఏడాది ముందుగానే ప్రవేశించాయి. దీంతో వానాకాలం సాగుకు ఢోఖా లేదని రైతులు (Farmers) భావించారు. అయితే జూన్ ప్రారంభం నుంచి రాష్ట్రంలో అంతగా వర్షాలు పడటం లేదు. పలు ప్రాంతాల్లో వర్షాలు పడుతున్నా.. సాగుకు కావాల్సిన మేర వానలు పడటం లేదని రైతులు అంటున్నారు. ఇప్పటికే నారు మడులు సిద్ధం చేసుకున్న రైతులు వర్షాలు లేకపోవడం వరినాట్లు వేయడానికి ఆలోచిస్తున్నారు. భారీ వర్షాలు పడితే పొలం పనులు ప్రారంభించడానికి అన్నదాతలు సిద్ధంగా ఉన్నారు.