అక్షరటుడే, ఇందూరు: Collector Nizamabad | జిల్లా కేంద్రంలోని ధర్మపురి హిల్స్ కాలనీని (Dharmapuri Hills Colony) కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి (Collector Vinay Krishna Reddy) సోమవారం సందర్శించారు. గతంలో అసైన్మెంట్ భూములను పంపిణీ చేసిన లబ్ధిదారుల జాబితాను పరిశీలించారు. ప్రభుత్వం కేటాయించిన స్థలంలో లబ్ధిదారులే ఉంటున్నారా లేదా.. అని ఆరాతీశారు. లబ్ధిదారులుగా కొనసాగుతున్న వారి పట్టా సర్టిఫికెట్లను తెప్పించుకుని అవి అధికారికంగా జారీ చేసినవా లేదా.. అని క్షుణ్ణంగా తనిఖీ చేశారు.
Collector Nizamabad | అర్హులను గుర్తించాలి
ఈ సందర్భంగా కలెక్టర్ ధర్మపురి హిల్స్ కాలనీలో ఎన్ని కుటుంబాలు ఇందిరమ్మ ఇళ్ల (Indiramma Illu) కోసం దరఖాస్తులు చేసుకున్నాయి. ఇందిరమ్మ ఇళ్ల పథకంలో భాగంగా ఎంతమందికి ఇప్పటిదాకా ఇళ్ల మంజూరీ లభించిందని వార్డ్ ఆఫీసర్ను వివరాలు అడిగి తెలుసుకున్నారు. రేకుల షెడ్లు, తాత్కాలిక గృహాల్లో నివాసాలు ఉంటున్న వారిలో అర్హులను గుర్తించి మంజూరు చేయాలని ఆదేశించారు. ఆమోదించిన 26 మంది లబ్దిదారులు వెంటనే ఇళ్ల నిర్మాణాలు ప్రారంభించేలా చూడాలన్నారు. అటవీ హద్దుల సమస్య కారణంగా కొంతమంది నిర్మాణాలను చేపట్టలేకపోతున్నారని మాజీ కార్పొరేటర్ హరూన్ కలెక్టర్ దృష్టికి తీసుకొచ్చారు. అధికారులతో మాట్లాడి సమస్య పరిష్కరిస్తామని కలెక్టర్ హామీ ఇచ్చారు. కలెక్టర్ వెంట నగర పాలక సంస్థ కమిషనర్ దిలీప్ కుమార్, నిజామాబాద్ సౌత్ తహశీల్దార్ బాలరాజు, నార్త్ తహశీల్దార్ విజయ్ కాంత్ రావు తదితరులున్నారు.