అక్షరటుడే, బాన్సువాడ: Mla Pocharam | గురుకుల పాఠశాలలకు అన్నిరకాల వసతులు కల్పిస్తున్నామని వ్యవసాయ సలహాదారు, ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి అన్నారు. బీర్కూర్ జ్యోతిబా పూలే (Jyotiba Phule) బీసీ బాలుర గురుకుల పాఠశాలలో (Gurukul School) రూ.26లక్షలతో నిర్మించనున్న అదనపు మరుగుదొడ్ల నిర్మాణానికి సోమవారం భూమిపూజ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తాను కూడా హాస్టళ్లలో చదివిన విద్యార్థినేన్నారు. కార్యక్రమంలో ఆగ్రో ఇండస్ట్రీస్ (Agro Industries) ఛైర్మన్ కాసుల బాలరాజ్, మార్కెట్ కమిటీ ఛైర్మన్ శ్యామల, వైస్ ఛైర్మన్ యామ రాములు, మాజీ ఎంపీపీ రఘు, తహశీల్దార్ లత, నాయకులు శశి, బోయిని శంకర్, బస్వరాజ్ పటేల్, సాయిబాబా తదితరులు పాల్గొన్నారు.
Mla Pocharam | గిరిజన బాలికల గురుకుల పాఠశాల ఆకస్మిక తనిఖీ
నస్రుల్లాబాద్ మండలం దుర్కి శివారులోని గిరిజన బాలికల గురుకుల పాఠశాలను సోమవారం వ్యవసాయ సలహాదారు, ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి ఆకస్మిక తనిఖీ చేశారు. మౌలిక వసతుల గురించి అడిగి తెలుసుకున్నారు. మెనూ ప్రకారం భోజనం, విద్యాబోధన అందుతుందా అని విద్యార్థినిలను అడిగి తెలుసుకున్నారు. రెండు రోజుల క్రితం రాత్రి విధి నిర్వహణలో పాఠశాలలో మృతి చెందిన ఉపాధ్యాయురాలు మామిడి స్వప్న మృతికి సంతాపంగా రెండు నిముషాలు మౌనం పాటించారు.
