అక్షరటుడే, వెబ్డెస్క్ : Gadwal | గద్వాల జిల్లాలో మేఘాలయ హనీమూన్ (Meghalaya honeymoon) మర్డర్ తరహా ఘటన చోటు చేసుకుంది. పెళ్లికి ముందే వివాహేతర సంబంధం పెట్టుకున్న యువతి.. ప్రియుడితో (boyfriend) కలిసి భర్తను హత్య చేయించింది. ఈ కేసులో సంచలన విషయాలు వెలుగు చూస్తున్నాయి.
Gadwal | పెళ్లికి ముందే జంప్
జోగుళాంబ గద్వాల జిల్లాకు (Jogulamba Gadwal district) చెందిన తేజేశ్వర్(32) ప్రైవేటు సర్వేయర్గా పని చేస్తున్నాడు. ఆయనకు ఏపీలోని కర్నూలుకు చెందిన ఐశ్వర్యతో వివాహం నిశ్చయం అయింది. అయితే పెళ్లికి ముందే ఆమెకు కర్నూలులోని (Kurnool) ఓ ప్రముఖ బ్యాంకుకు చెందిన ఉద్యోగితో అక్రమ సంబంధం ఉంది. పెళ్లికి ఐదు రోజుల ముందు ఆమె ఇంట్లో నుంచి పారిపోయింది. దీంతో అతడి దగ్గరకే పారిపోయిందని అంతా అనుకున్నారు. తీరా ఫిబ్రవరి 16న ఇంటికి తిరిగోచ్చిన ఐశ్వర్య తను ఎటు పారిపోలేదని తేజేశ్వర్కు (Tejeshwar) చెప్పింది. కట్నం డబ్బుల కోసం స్నేహితురాలి ఇంటికి వెళ్లానని నమ్మించింది. దీంతో తేజేశ్వర్ ఆమె మాటలు నమ్మి తల్లిదండ్రులను పెళ్లికి ఒప్పించాడు. దీంతో మే 17న వారి పెళ్లి అయింది.
Gadwal | ప్రియుడికి 2000 సార్లు ఫోన్
పెళ్లి అయిన తర్వాత ఐశ్వర్య (Aishwarya) ప్రియుడితో ఫోన్లో మాట్లాడడం మొదలు పెట్టింది. తనను పట్టించుకోకుండా భార్య నిత్యం ఫోన్లో మాట్లాడుతుండడంతో పెళ్లయిన రెండో రోజు నుంచే ఇరువురి మధ్య మనస్పర్థలు మొదలయ్యాయి. ఈ క్రమంలో జూన్ 17న తేజేశ్వర్ (Tejeshwar) అదృశ్యమవ్వగా.. అతడి సోదరుడు పోలీసులకు ఫిర్యాదు (Police complaint) చేశాడు. విచారణ చేపట్టిన పోలీసులు పెళ్లయిన తర్వాత ఐశ్వర్య సదరు బ్యాంకు ఉద్యోగితో 2,000 సార్లు ఫోన్ మాట్లాడినట్టు పోలీసులు గుర్తించారు.
తేజేశ్వర్ కోసం గాలిస్తుండగా ఏపీలోని పాణ్యం పోలీసులకు మృతదేహం దొరికింది. తేజేశ్వర్ కుటుంబ సభ్యులు (family members) ఐశ్వర్యపై అనుమానం వ్యక్తం చేయగా పోలీసులు ఐశ్వర్య, ఆమె తల్లి సుజాతను విచారించగా.. విస్తుపోయే విషయాలు బయటికొచ్చాయి
Gadwal | పొలం కొంటామని చెప్పి హత్య
తేజేశ్వర్ను హత్య చేయించేందుకు ఆ బ్యాంకు ఉద్యోగి (bank employee) కొందరికి సుపారీ ఇవ్వడమే కాక తన డ్రైవర్ను వారి వెంట పంపినట్లు సమాచారం. పథకం ప్రకారం కొంతమంది వ్యక్తులు జూన్ 17న తేజేశ్వర్ను కలిసి తాము 10 ఎకరాల పొలం కొంటున్నామని సర్వే చేయాలని చెప్పి గద్వాలలో (Gadwal) కారు ఎక్కించుకుని తీసుకెళ్లారు. అనంతరం కారులోనే ఆయనపై కత్తులతో దాడి చేసి చంపేశారు. మృతదేహాన్ని పాణ్యం సమీపంలోని సుగాలిమెట్టు వద్ద పారేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు ఐశ్వర్య, సుజాతను అదుపులోకి తీసుకున్నారు. సదరు బ్యాంకు ఉద్యోగి పరారీలో ఉన్నాడు. అతని కోసం పోలీసులు గాలిస్తున్నారు.