అక్షరటుడే, వెబ్డెస్క్ :DSP Transfers | రాష్ట్రంలో పలువురు డీఎస్పీలు బదిలీ(DSP Transfers) అయ్యారు. 12 మంది డీఎస్పీలకు స్థాన చలనం కలిగిస్తూ డీజీపీ జితేందర్(DGP Jitender) ఉత్తర్వులు జారీ చేశారు. ఆదిలాబాద్ డీటీసీ డీఎస్పీగా ఉన్న అనుముల శ్రీనివాస్ను హైదరాబాద్ ఈస్ట్ జోన్ ట్రాఫిక్ ఏసీపీ-5గా ట్రాన్స్ఫర్ చేశారు. ఆ స్థానంలో పని చేస్తున్న సంపత్ కుమార్ను డీజీపీ కార్యాలయంలో రిపోర్ట్ చేయాలని ఆదేశించారు.
మెదక్ డీసీఆర్బీ డీఎస్పీ కొంతం చంద్రశేఖర్ రెడ్డిని మాదాపూర్ ట్రాఫిక్ ఏసీపీ(Madhapur Traffic ACP)గా బదిలీ చేశారు. అక్కడున్న కందుల సత్యనారాయణను డీజీపీ కార్యాలయానికి పంపించారు. పోస్టింగ్ కోసం ఎదురుచూస్తున్న పురుషోత్తం రెడ్డిని ఇంటెలిజెన్స్ డీఎస్పీ(Intelligence DSP)గా, శ్రీనాథ్ రెడ్డిని డీఎస్పీ కమాండ్ కంట్రోల్ కేంద్రం(DSP Command Control Center)లోకి పంపించారు.
సంగారెడ్డి డీసీఆర్బీ డీఎస్పీ రణ్వీర్ రెడ్డిని హైదరాబాద్ స్పెషల్ బ్రాంచ్(Hyderabad Special Branch)కు, పోస్టింగ్ కోసం ఎదురుచూస్తున్న రామ్మోహన్ రెడ్డిని ఇంటెలిజెన్స్కు బదిలీ చేశారు. ఇంటెలిజెన్స్లో ఉన్న భాస్కర్ను హైదరాబాద్ మీర్ చౌక్ ఏసీపీ(Hyderabad Mir Chowk ACP)గా, అక్కడున్న వెంకటేశ్వర్ రావును డీజీపీ కార్యాలయానికి ట్రాన్స్ఫర్ చేశారు. డీజీపీ కార్యాలయంలో కంట్రోల్ రూమ్ ఏసీపీగా ఉన్న సాయిరెడ్డి వెంకట్ రెడ్డిని నాగర్ కర్నూల్ జిల్లా కల్వకుర్తి డీఎస్పీ(Kalvakurthi DSP)గా అక్కడున్న పల్లె వెంకటేశ్వర్లును డీజీపీ కార్యాలయానికి బదిలీ చేశారు.