అక్షరటుడే, కామారెడ్డి గ్రామీణం:Bhubharati | భూభారతి చట్టంతో రైతులకు ప్రయోజనం చేకూరుతుందని కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్(Collector Ashish Sangwan) అన్నారు. శనివారం బీబీపేట, దోమకొండ మండలకేంద్రాల్లో నిర్వహించిన అవగాహన సదస్సుల్లో పాల్గొని మాట్లాడారు. గతంలో ధరణి పోర్టల్(Dharani Portal)లో అప్పీల్కు ఆస్కారం లేక సివిల్ కోర్టు(Civil Court)కు వెళ్లాల్సి వచ్చేదని, ప్రస్తుతం భూభారతితో తహసీల్దార్(Tahsildar) ఇచ్చిన తీర్పులో అభ్యంతరముంటే ఆర్డీఓ, కలెక్టర్కు అప్పీల్ చేసుకోవచ్చన్నారు.
2014 జూన్ 2కు ముందు గ్రామీణ ప్రాంతంలో వ్యవసాయ భూమిని సాదాబైనామ ద్వారా కొనుగోలు చేసి క్రమబద్ధీకరణ కోసం చేసుకున్న దరఖాస్తులపై ఆర్డీఓ(RDO)లు విచారణ చేస్తారని, అర్హత ఉన్న వారికి రిజిస్ట్రేషన్, స్టాంప్ డ్యూటీ ఆధారంగా సర్టిఫికెట్ జారీ చేస్తారని పేర్కొన్నారు. సమావేశంలో ఆర్డీఓ వీణ, తహసీల్దార్ సంజయ్, రైతులు పాల్గొన్నారు.