అక్షరటుడే, వెబ్డెస్క్: Kadiyam Srihari : కడియం అనుచరులు కబ్జా చేసిన భూమిని రెవెన్యూ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. జనగామ జిల్లా(Jangaon district) స్టేషన్ ఘనపూర్ డివిజన్ కేంద్రంలోని శివునిపల్లి పరిధిలోగల సర్వే నంబరు 46 లో ఉన్న 34 ఎకరాల భూమిలో కొంత స్థలాన్ని కడియం అనుచరులు కబ్జా చేశారు.
ఈ విషయంలో మాజీ ఎమ్మెల్యే డాక్టర్ రాజయ్య(Former MLA Dr. Rajaiah) ప్రెస్మీట్లో అధికారులను హెచ్చరించారు. దీంతో అధికారులపై తీవ్ర ఒత్తిడి పెరిగింది. దీంతో రెవెన్యూ అధికారులు స్పందించారు. సంబంధిత సర్వే నంబరు 46లో కబ్జాకు గురైన భూమిని స్వాధీనం చేసుకొన్నారు. కడియం శ్రీహరి అనుచరులు నాటిన కనీలను తొలగించారు.
స్థానిక ఆర్ఐRI సతీష్, సర్వేయర్ నరేష్ హద్దులను సరిచూసుకున్నారు. అధికారులు చేరుకున్నాక.. కొంతమంది రియల్ ఎస్టేట్ వ్యాపారులు అక్కడికి వచ్చి, నిలదీసే ప్రయత్నం చేశారు. కానీ, అధికారులు వెనక్కి తగ్గకుండా దగ్గరుండి భూమి స్వాధీనం పనులు పూర్తి చేశారు.