అక్షరటుడే, బిచ్కుంద: Bichkunda | బిచ్కుంద మండల కేంద్రంలో ఇటీవల బట్టల వ్యాపారి (Cloth merchant) హత్యాయత్నం కేసులో నిందితులను అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించినట్టు ఎస్సై మోహన్ రెడ్డి తెలిపారు. ఆయన తెలిపిన వివరాల ప్రకారం.. బిచ్కుందకు చెందిన షేక్ ఖలీల్కు అతని బంధువైన అమన్, అతని కుటుంబ సభ్యులకు బిచ్కుందలోని స్థలం విషయమై వివాదం నెలకొంది.
ఈ క్రమంలో షేక్ ఖలీల్ ను హత్య చేసి స్థలం కబ్జా చేయాలనుకున్నాడు. ఈ మేరకు అమన్, అతని కుటుంబ సభ్యులు నాందేడ్ ప్రాంతానికి చెందిన ముబీన్, రితేష్, వైభవ్, సుశాంత్ కు సుపారి ఇచ్చాడు. దీంతో వారు ఈనెల 15 న సాయంత్రం ముబీన్ ముగ్గురితో కలిసి ఖలీల్ను చాకుతో పొడిచి పారిపోయాడు. బాధితుడి ఫిర్యాదు మేరకు కేసు. నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. శనివారం ముబీన్, రితేష్, వైభవ్, సుశాంత్ ను అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించినట్టు పేర్కొన్నారు.