అక్షరటుడే, హైదరాబాద్: Kaushik Reddy : తన మీద కేసులు పెడితే AK-47 గన్ అవుతానని బీఆర్ఎస్ నేత (BRS leader), ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి (MLA Kaushik Reddy) పేర్కొన్నారు. అక్రమ కేసులకు భయపడేది లేదని స్పష్టం చేశారు. ఎక్స్టార్షన్ అని తన మీద కేసు పెట్టారని.. ఎక్స్టార్షన్ అంటే సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) కాంట్రాక్టర్ల దగ్గర 20 శాతం కమీషన్ తీసుకునేదని కౌశిక్రెడ్డి ఆరోపించారు.
వరంగల్ జిల్లా(Warangal district)లో సీతక్క ఇసుక దందా చేసి కాంట్రాక్టర్లను బెదిరించి పైసలు వసూలు చేయడం ఎక్స్టార్షన్(Extortion – దోపిడీ) అని పేర్కొన్నారు. కడియం శ్రీహరి(Kadiyam Srihari) పేదలను బెదిరించి భూములు గుంజుకోవడం ఎక్స్టార్షన్(Extortion) అని అన్నారు.
వరంగల్ జిల్లాలో జరుగుతున్న స్కాములన్నీ ప్రెస్ మీట్ పెట్టి బయట పెడతానని స్పష్టం చేశారు. ఆదివారం మీడియా సమావేశం ఏర్పాటు చేసి ఆధారాలతో సహా మొత్తం బయటపెడతానని అన్నారు. ఎవరూ ఊహించని విధంగా ఈ ప్రెస్మీట్ (press meet) ఉంటుందన్నారు. తనకు బెయిల్ వచ్చేలా చేసిన బీఆర్ఎస్ లీగల్ టీంకు ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి (MLA Padi Kaushik Reddy) కృతజ్ఞతలు తెలిపారు.