అక్షరటుడే, లింగంపేట: Lingampet | విధుల పట్ల నిర్లక్ష్యంగా వహించిన లింగంపేట పంచాయతీ కార్యదర్శిపై కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ చర్యలు తీసుకున్నారు. లింగంపేటలో నాగన్న దిగుడుబావిలో (Naganna Digudu bavi) శనివారం యోగాసనాలు వేశారు. కార్యక్రమం ముగిసిన అనంతరం కలెక్టర్ లింగంపేట గ్రామాన్ని సందర్శించారు. గతేడాది డయేరియా (Diarrhea) బారిన పడిన వాళ్ల ఇళ్లను తనిఖీ చేశారు.
గ్రామాల్లో పారిశుధ్యం అస్తవ్యస్తంగా ఉండడంతో కార్యదర్శికి షోకాజ్ నోటీసు ఇవ్వాలని జిల్లా పంచాయతీ అధికారి (District Panchayat Officer) మురళిని ఆదేశించారు. దీంతో లింగంపేట కార్యదర్శి శ్రావణ్ కుమార్కు డీపీవో నోటీసు జారీ చేశారు. కార్యక్రమంలో డీఎంహెచ్వో (DMHO) చంద్రశేఖర్, డీఎల్పీవో (DLPO) సురేందర్, డీఆర్డీవో సురేందర్, ఎంపీడీవో నరేష్, ఎంపీడీవో మలహరి తదితరులు పాల్గొన్నారు.