అక్షరటుడే జక్రాన్పల్లి: Padakal | విద్యుదాఘాతంతో గేదె మృతి చెందిన ఘటన జక్రాన్పల్లి (jakranpally) మండలం పడకల్ గ్రామంలో చోటు చేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన భూషణ్ అనే రైతుకు చెందిన పాడి గేదె శుక్రవారం సాయంత్రం ట్రాన్స్ఫార్మర్ వద్ద గడ్డి మేస్తూ విద్యుదాఘాతంతో మృతి చెందింది. దీంతో వెంటనే రైతు విద్యుత్శాఖ అధికారులకు సమాచారమిచ్చారు.
అయితే ట్రాన్స్ఫార్మర్ను (Transformer) ఆఫ్ చేసి గేదెను తొలగించుకోవాలని వారు సమాధానం ఇచ్చినట్లు రైతు పేర్కొన్నారు. ట్రాన్స్ఫార్మర్ ఆఫ్ చేస్తే గ్రామంలో విద్యుత్ సరఫరా నిలిచిపోతుందని గ్రామస్థులు వాపోయారు. చివరకు పోలీసులకు సమాచారం ఇవ్వగా వారు వచ్చి వారు వచ్చి గేదెను తొలగించపజేశారని గ్రామస్థులు పేర్కొన్నారు.