More
    HomeతెలంగాణCM Revanth | బీఆర్ఎస్‌ రాజకీయంగా చచ్చిపోయింది: సీఎం రేవంత్​రెడ్డి

    CM Revanth | బీఆర్ఎస్‌ రాజకీయంగా చచ్చిపోయింది: సీఎం రేవంత్​రెడ్డి

    Published on

    అక్షరటుడే, వెబ్​డెస్క్: CM Revanth | రాష్ట్రంలో బీఆర్​ఎస్ (BRS)​ రాజకీయంగా ఎప్పుడో చచ్చిపోయిందని సీఎం రేవంత్​రెడ్డి (CM Revanth Reddy) అన్నారు. శుక్రవారం ఆయన మీడియా చిట్​చాట్​లో మాట్లాడారు. చనిపోయిన పార్టీని బతికించుకోవడానికి ఆ పార్టీ నాయకులు అబద్దాలు మాట్లాడుతున్నారని ఆరోపించారు. అధికారం పోయి హరీష్‌రావు అసహనంతో మాట్లాడుతున్నారని సీఎం వ్యాఖ్యానించారు.

    CM Revanth | అందుకే బీజేపీ గెలిచింది

    రాష్ట్రంలో లోక్​ సభ ఎన్నికల్లో బీజేపీ గెలిచేందుకు బీఆర్ఎస్‌ ఆర్గాన్‌ డొనేషన్‌ చేసిందని రేవంత్​రెడ్డి అన్నారు. అందుకే బీజేపీ 8 స్థానాల్లో గెలిచిందని ఆయన పేర్కొన్నారు. బీజేపీ కోసం పనిచేసినందుకే మెదక్‌లో బీఆర్​ఎస్​ ఓడిందన్నారు. కేంద్ర మంత్రి కిషన్​రెడ్డి (Kishan Reddy)పై సైతం సీఎం సంచలన వ్యాఖ్యలు చేశారు. కిషన్‌రెడ్డి కేటీఆర్‌కు లైజనింగ్ ఆఫీసరని, ప్రైవేట్​ ట్యూషన్ మాస్టర్ అని అన్నారు. కిషన్​రెడ్డి బీఆర్​ఎస్ కోసం​ పని చేస్తున్నారని ఆరోపించారు. తాను ఢిల్లీకి వెళ్లకముందే కిషన్ రెడ్డి వెళ్లి కేంద్ర పెద్దలను కలిశారన్నారు. బీఆర్ఎస్ పార్టీకి అనుకూలంగా కేంద్ర పెద్దలతో కిషన్ రెడ్డి మాట్లాడారని ఆరోపించారు.

    READ ALSO  Rythu Nestham | మరిన్ని రైతు వేదికల్లో రైతు నేస్తం.. నేడు ప్రారంభించనున్న సీఎం

    CM Revanth | ఏపీతో వివాదాలు కోరుకోవడం లేదు

    గోదావరి జలాల (Godavari Water) తరలింపునకు బీజం వేసిందే బీఆర్ఎస్ అని సీఎం ఆరోపించారు. అపెక్స్ కౌన్సిల్​లో కేసీఆర్ అందుకు ఆమోదం తెలిపారన్నారు. దీంతోనే చంద్రబాబు నాయకుడు బనకచర్ల ప్రాజెక్ట్​తో గోదావరి నీళ్లను తరలించారని చెప్పారు. చంద్రబాబు మళ్లీ గెలవాలంటే గోదావరి నీళ్లు కావాలని బీఆర్​ఎస్​ గెలవాలన్నా అవే కావాలని ఆయన అన్నారు. అందుకే ఈ నీటి వివాదాలు అని సీఎం సంచలన వ్యాఖ్యలు చేశారు. అయితే గోదావరి జలాలపై రెండు రాష్ట్రాలు కూర్చొని మాట్లాడుకుంటే సమస్య పరిష్కారం అవుతుందని సీఎం రేవంత్​రెడ్డి అన్నారు. చర్చలకు తామే ఒక అడుగు ముందుకేస్తామని.. ఏపీతో వివాదాలు కోరుకోవడం లేదని ఆయన పేర్కొన్నారు. నాలుగు రోజులైనా చర్చల కోసం కూర్చోవడానికి తాము సిద్ధం అన్నారు.

    READ ALSO  Banakacharla | సీఎం రేవంత్​రెడ్డికి బేసిక్స్​ తెలియవు.. హరీశ్​రావు సంచలన వ్యాఖ్యలు

    Latest articles

    Yoga Day | యోగాతో సంపూర్ణ ఆరోగ్యం.. నేడు ఇంటర్నేషనల్ యోగా డే

    అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Yoga Day : మన దేశ పురాతన సాంస్కృతిక వారసత్వానికి ప్రతీక అయిన యోగా(Yoga).. ప్రపంచవ్యాప్తంగా...

    Australia | 16 ఏళ్లలోపు వారికి సోషల్​ మీడియా నిషేధం.. చారిత్రాత్మక నిర్ణయం దిశగా అడుగులు

    అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Australia : 16 ఏళ్ల కంటే తక్కువ వయసు ఉన్న పిల్లల సోషల్ మీడియా వాడకంపై...

    Iran | ఇరాన్‌కు ఆమె శాపమే తగిలిందా..? నెట్టింట వైరల్​ అవుతున్న 2004 నాటి విషాద గాథ

    అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Iran : అది ఆగస్టు 15, 2004 ఉదయం.. ఇరాన్‌లోని నేకా నగరం.. అందరూ చూస్తుండగానే...

    Padakal | విద్యుదాఘాతంతో గేదె మృతి

    అక్షరటుడే జక్రాన్​పల్లి: Padakal | విద్యుదాఘాతంతో గేదె మృతి చెందిన ఘటన జక్రాన్​పల్లి (jakranpally) మండలం పడకల్​ గ్రామంలో...

    More like this

    Yoga Day | యోగాతో సంపూర్ణ ఆరోగ్యం.. నేడు ఇంటర్నేషనల్ యోగా డే

    అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Yoga Day : మన దేశ పురాతన సాంస్కృతిక వారసత్వానికి ప్రతీక అయిన యోగా(Yoga).. ప్రపంచవ్యాప్తంగా...

    Australia | 16 ఏళ్లలోపు వారికి సోషల్​ మీడియా నిషేధం.. చారిత్రాత్మక నిర్ణయం దిశగా అడుగులు

    అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Australia : 16 ఏళ్ల కంటే తక్కువ వయసు ఉన్న పిల్లల సోషల్ మీడియా వాడకంపై...

    Iran | ఇరాన్‌కు ఆమె శాపమే తగిలిందా..? నెట్టింట వైరల్​ అవుతున్న 2004 నాటి విషాద గాథ

    అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Iran : అది ఆగస్టు 15, 2004 ఉదయం.. ఇరాన్‌లోని నేకా నగరం.. అందరూ చూస్తుండగానే...