అక్షరటుడే, వెబ్డెస్క్: CM Revanth | రాష్ట్రంలో బీఆర్ఎస్ (BRS) రాజకీయంగా ఎప్పుడో చచ్చిపోయిందని సీఎం రేవంత్రెడ్డి (CM Revanth Reddy) అన్నారు. శుక్రవారం ఆయన మీడియా చిట్చాట్లో మాట్లాడారు. చనిపోయిన పార్టీని బతికించుకోవడానికి ఆ పార్టీ నాయకులు అబద్దాలు మాట్లాడుతున్నారని ఆరోపించారు. అధికారం పోయి హరీష్రావు అసహనంతో మాట్లాడుతున్నారని సీఎం వ్యాఖ్యానించారు.
CM Revanth | అందుకే బీజేపీ గెలిచింది
రాష్ట్రంలో లోక్ సభ ఎన్నికల్లో బీజేపీ గెలిచేందుకు బీఆర్ఎస్ ఆర్గాన్ డొనేషన్ చేసిందని రేవంత్రెడ్డి అన్నారు. అందుకే బీజేపీ 8 స్థానాల్లో గెలిచిందని ఆయన పేర్కొన్నారు. బీజేపీ కోసం పనిచేసినందుకే మెదక్లో బీఆర్ఎస్ ఓడిందన్నారు. కేంద్ర మంత్రి కిషన్రెడ్డి (Kishan Reddy)పై సైతం సీఎం సంచలన వ్యాఖ్యలు చేశారు. కిషన్రెడ్డి కేటీఆర్కు లైజనింగ్ ఆఫీసరని, ప్రైవేట్ ట్యూషన్ మాస్టర్ అని అన్నారు. కిషన్రెడ్డి బీఆర్ఎస్ కోసం పని చేస్తున్నారని ఆరోపించారు. తాను ఢిల్లీకి వెళ్లకముందే కిషన్ రెడ్డి వెళ్లి కేంద్ర పెద్దలను కలిశారన్నారు. బీఆర్ఎస్ పార్టీకి అనుకూలంగా కేంద్ర పెద్దలతో కిషన్ రెడ్డి మాట్లాడారని ఆరోపించారు.
CM Revanth | ఏపీతో వివాదాలు కోరుకోవడం లేదు
గోదావరి జలాల (Godavari Water) తరలింపునకు బీజం వేసిందే బీఆర్ఎస్ అని సీఎం ఆరోపించారు. అపెక్స్ కౌన్సిల్లో కేసీఆర్ అందుకు ఆమోదం తెలిపారన్నారు. దీంతోనే చంద్రబాబు నాయకుడు బనకచర్ల ప్రాజెక్ట్తో గోదావరి నీళ్లను తరలించారని చెప్పారు. చంద్రబాబు మళ్లీ గెలవాలంటే గోదావరి నీళ్లు కావాలని బీఆర్ఎస్ గెలవాలన్నా అవే కావాలని ఆయన అన్నారు. అందుకే ఈ నీటి వివాదాలు అని సీఎం సంచలన వ్యాఖ్యలు చేశారు. అయితే గోదావరి జలాలపై రెండు రాష్ట్రాలు కూర్చొని మాట్లాడుకుంటే సమస్య పరిష్కారం అవుతుందని సీఎం రేవంత్రెడ్డి అన్నారు. చర్చలకు తామే ఒక అడుగు ముందుకేస్తామని.. ఏపీతో వివాదాలు కోరుకోవడం లేదని ఆయన పేర్కొన్నారు. నాలుగు రోజులైనా చర్చల కోసం కూర్చోవడానికి తాము సిద్ధం అన్నారు.