అక్షరటుడే, నిజామాబాద్ సిటీ: Chemist and Druggist Association | జిల్లా కెమిస్ట్ అండ్ డ్రగ్గిస్ట్ అసోసియేషన్ ఎన్నికలు ఈనెల 22న జరగనున్నాయి. నగరంలోని ప్రగతినగర్(Pragathinagar) మున్నూరుకాపు సంఘంలో (Munnurukapu sangham) జిల్లా సర్వసభ్య సమావేశం నిర్వహించనున్నారు. అనంతరం సాయంత్రం ఎన్నికల ప్రక్రియ చేపడతారు. ఈ సందర్భంగా పోటీచేసే అభ్యర్థులు 15 రోజులుగా జోరుగా ప్రచారం చేస్తున్నారు. తమను గెలిపించాలని అధ్యక్ష కార్యదర్శులు నల్ల మధుసూదన్, బీర్కూర్ సుధాకర్, కోశాధికారి మోర సాయిలు ప్రచారం చేస్తుండగా.. మార్పు కోసం తమకు అవకాశమివ్వాలని ప్రత్యర్థి అభ్యర్థులు కొండ సత్యప్రసాద్, సంతోష్, రమేష్ ప్రచారం చేస్తున్నారు. సమావేశంలో ఏజెన్సీ ప్రతినిధులు భూమేష్, జీవన్ రెడ్డి, సతీష్ రెడ్డి, అనిల్ గౌడ్, రంజిత్ గౌడ్, దత్తు యాదవ్, చాట్ల శ్రీనివాస్, తదితరులు పాల్గొన్నారు.

మెడికల్ జిల్లా సంఘం ఎన్నికల ప్రచారంలో మాట్లాడుతున్న కొండ సత్య ప్రసాద్

మాట్లాడుతున్న జిల్లా మెడికల్ సంఘం అధ్యక్షుడు నల్ల మధుసూదన్