అక్షరటుడే, ఆర్మూర్: Ex Mla Jeevan Reddy | కాంగ్రెస్ అవినీతి బాగోతాలను వరుసగా బయటపెడతామని నిజామాబాద్ బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే జీవన్రెడ్డి పేర్కొన్నారు. శుక్రవారం హైదరాబాద్లో విలేకరులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కేసీఆర్వీ ట్రిపుల్ ఆర్ స్కీములైతే.. రేవంత్రెడ్డివి (CM revanth Reddy) ట్రిపుల్ ఆర్ స్కాములని అభివర్ణించారు. రేవంత్రెడ్డి తన సోదరుడు రంజిత్రెడ్డి, మరో వ్యక్తి ఫహీం ద్వారా రాష్ట్రంలో దోపిడీకి పాల్పడుతున్నాడని.. రాహుల్గాంధీకి మూటలు మోస్తున్నాడని ఆరోపించారు.
Ex Mla Jeevan Reddy | తెలంగాణ తెచ్చిన గొప్ప వ్యక్తి కేసీఆర్
తెలంగాణను సాధించిన గొప్ప వ్యక్తి కేసీఆర్ అయితే.. ఐటీ మంత్రిగా హైదరాబాద్కు విశ్వ ఖ్యాతిని తెచ్చిన ఘనత కేటీఆర్ది అని ఆయన స్పష్టం చేశారు. శనివారం కేటీఆర్ ఇంగ్లండ్లోని ప్రతిష్ఠాత్మక ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీలో (Oxford University) ఆక్స్ఫర్డ్ ఇండియా ఫోరం (Oxford India Forum) ఆధ్వర్యంలో జరుగుతున్న ఫ్రాంటియర్ టెక్నాలజీ ఫర్ డెవలప్మెంట్ ఇన్ ఇండియా (Frontier Technology for Development in India) సదస్సులో మాట్లాడబోతున్నారని వివరించారు.
Ex Mla Jeevan Reddy | ఢిల్లీలో రేవంత్రెడ్డి పడిగాపులు..
రేవంత్ రెడ్డి రాహుల్ గాంధీ దర్శనం కోసం ఢిల్లీలో పడిగాపులు గాస్తున్నారని జీవన్రెడ్డి ఎద్దేవా చేశారు. కనీసం రాహుల్ గాంధీకి బర్త్ డే విషెస్ కూడా చెప్పేందుకు వీలులేని రేవంత్రెడ్డి కేసీఆర్ కుటుంబాన్ని దూషించడమేమిటన్నారు. ఏఐసీసీ (AICC) అంటే ఆలిండియా కరప్షన్ సెంటర్, పీసీసీ అంటే ప్రదేశ్ ‘కరప్షన్’ సెంటర్ అని మండిపడ్డారు. సీఎం అండతో దోచుకుంటున్న చేవెళ్ల మాజీ ఎంపీ రంజిత్ రెడ్డి ఆగడాలకు అంతే లేకుండా పోయిందన్నారు. రూ.10వేల కోట్ల లియోనియా రిసార్ట్ ల్యాండ్ స్కామ్ రంజిత్ రెడ్డి దోపిడీకి పరాకాష్ట అని ఆయన అభివర్ణించారు. బీజేపీ ఎంపీలు బండి సంజయ్, అరవింద్, కిషన్ రెడ్డిలు ఎందుకు ఈ అవినీతిపై నోరు మెదపడం లేదని నిలదీశారు. కేంద్ర హోం మంత్రి అమిత్ షా (Union Home Minister Amit Shah) స్పందించి సీబీఐ, ఐటీ, ఈడీ దర్యాప్తు చేయించాలని కోరారు. సమావేశంలో మన్నె గోవర్ధన్ రెడ్డి, కె.వాసుదేవ రెడ్డి, పల్లె రవికుమార్, రవి నాయక్ పాల్గొన్నారు.