More
    HomeతెలంగాణNita Ambani | బ‌ల్కంపేట ఎల్ల‌మ్మ ఆల‌యానికి నీతా అంబానీ భారీ విరాళం..

    Nita Ambani | బ‌ల్కంపేట ఎల్ల‌మ్మ ఆల‌యానికి నీతా అంబానీ భారీ విరాళం..

    Published on

    అక్షరటుడే, వెబ్​డెస్క్: Nita Ambani | హైదరాబాద్ నగరంలోని ప్రసిద్ధ బల్కంపేట ఎల్లమ్మ(Balkampet Yellamma), పోచమ్మ దేవస్థానానికి(Pochamma temple) రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముకేష్ అంబానీ సతీమణి నీతా అంబానీ భారీ విరాళాన్ని అందించారు. ఆలయ అభివృద్ధి కోసం ఆమె కోటి రూపాయలు విరాళంగా(One crore rupees donated) ప్రకటించి, బుధవారం ఆ మొత్తాన్ని దేవస్థానం ఖాతాలో జమ చేశారు. తరచూ బల్కంపేట ఎల్లమ్మ అమ్మవారిని దర్శించుకునే నీతా అంబానీ(Nita Ambani), ఈసారి ఇలా భారీ విరాళం ఇవ్వ‌డంతో దేవస్థానం అధికారులు.. వాటిని దేనికి వినియోగించాలనే దానిపై కూడా నిర్ణయం తీసుకున్నారు. ఈ విరాళంపై స్పందించిన ఆలయ ఈవో మహేందర్ గౌడ్(Temple EO Mahender Goud) మాట్లాడుతూ..ఈ మొత్తాన్ని బ్యాంకులో ఫిక్స్‌డ్ డిపాజిట్‌గా వేసి, దాని వడ్డీ ద్వారా నిత్య అన్నదాన కార్యక్రమాన్ని మరింత విస్తృతంగా నిర్వహిస్తామని తెలిపారు. భవిష్యత్‌లో ఏ ఒక్క భక్తుడూ ఆకలితో ఆలయం విడిచిపెట్టకూడదనే లక్ష్యంతో ఈ నిర్ణయం తీసుకున్నామని వివరించారు.

    READ ALSO  Armoor | ఆలయ ఆవరణలో స్వచ్ఛ కార్యక్రమం

    Nita Ambani | భారీ విరాళం..

    ఈ ఏడాది ఐపీఎల్ సీజన్‌లో ముంబై ఇండియన్స్ జట్టు (Mumbai Indians) హైదరాబాద్ ఉప్పల్ స్టేడియంలో ఆడిన సందర్భంగా, నీతా అంబానీ తన తల్లి పూర్ణిమ దలాల్, సోదరి మమతా దలాల్‌లతో కలిసి బల్కంపేట ఎల్లమ్మ ఆలయాన్ని సందర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అప్పట్లో ఆలయ అధికారులు ఆలయ విశిష్టతను వివరించడంతో పాటు, అభివృద్ధి పనులకు సహకారం అందించాలని ఆమెను కోరారు. ఆ విజ్ఞప్తికి ప్రతిస్పందనగా ఈ విరాళం అందించారు. ముంబై ఇండియన్స్‌ మ్యాచ్‌ల సమయంలో స్టేడియంకు బయలుదేరే ముందు ఆమె ఆలయాన్ని తప్పనిసరిగా దర్శించుకుంటారు. కొన్ని సందర్భాల్లో మ్యాచ్‌ మధ్యలో కూడా అమ్మవారిని ప్రార్థించినట్లు విజువల్స్ సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయిన సందర్భాలున్నాయి.

    ఈ విరాళం నిత్య అన్నదానానికి అండగా నిలుస్తుందని ఆలయ అధికారులు పేర్కొంటున్నారు. భక్తులకు(Devotees) మరింత మంచి సేవలు అందించేందుకు ఇది దోహదపడనుందని విశ్వాసం వ్యక్తం చేశారు. కొన్ని సందర్భాల్లో మ్యాచ్ ఉత్కంఠభరితంగా సాగుతున్నప్పుడు కూడా ఆమె స్టేడియం నుంచే అమ్మవారికి ప్రార్థనలు చేసిన సందర్భాలు ఉన్నాయి. 2019 ఐపీఎల్ ఫైనల్‌లో ముంబై ఇండియన్స్ విజయం సాధించాలని ఆమె ప్రార్థిస్తున్న ఫొటోలు, వీడియోలు అప్పట్లో తెగ వైరల్ అయ్యాయి. ఇక ఈ సారి ఐపీఎల్‌లో ముంబై ఇండియ‌న్స్ మంచి ప్ర‌ద‌ర్శ‌నే క‌న‌బ‌రిచింది. ప్లే ఆఫ్స్ వ‌ర‌కు చేరుకున్నా ఫైన‌ల్ వ‌ర‌కు వెళ్ల‌లేక చ‌తికిల ప‌డింది.

    READ ALSO  Kamareddy | ధరణి వెంచర్‌లో వసతులు కల్పించాలి

    Latest articles

    Education System | విద్యావ్యవస్థలో లోపాలపై కేంద్రం నజర్.. అధ్యయనానికి ప్రత్యేక కమిటీ ఏర్పాటు

    అక్షరటుడే, న్యూఢిల్లీ: Education System : ప్రస్తుత పాఠశాల విద్యా వ్యవస్థలోని నెలకొన్న లోపాలను పరిశీలించడానికి విద్యా మంత్రిత్వ...

    Health Minister | ఆరోగ్యమంత్రిని కలిసిన పీఎంపీ, ఆర్​ఎంపీలు

    అక్షరటుడే, హైదరాబాద్: Health Minister : రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ(Minister Damodar Rajanarsimha)ను శుక్రవారం...

    Phone Tapping Case | బండి సంజయ్​ ఫోన్​ ట్యాపింగ్​.. వాంగ్మూలం అడిగిన అధికారులు

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Phone Tapping Case | తెలంగాణలో సంచలనం సృష్టించిన ఫోన్​ ట్యాపింగ్​ కేసు (Phone...

    Education System | విద్యావ్యవస్థలో లోపాలపై కేంద్రం నజర్.. అధ్యయనానికి తొమ్మిది మంది సభ్యులతో ప్రత్యేక కమిటీ

    అక్షరటుడే, వెబ్​డెస్క్​: Education System | ప్రస్తుత పాఠశాల విద్యా వ్యవస్థలోని నెలకొన్న లోపాలను పరిశీలించడానికి విద్యా మంత్రిత్వ...

    More like this

    Education System | విద్యావ్యవస్థలో లోపాలపై కేంద్రం నజర్.. అధ్యయనానికి ప్రత్యేక కమిటీ ఏర్పాటు

    అక్షరటుడే, న్యూఢిల్లీ: Education System : ప్రస్తుత పాఠశాల విద్యా వ్యవస్థలోని నెలకొన్న లోపాలను పరిశీలించడానికి విద్యా మంత్రిత్వ...

    Health Minister | ఆరోగ్యమంత్రిని కలిసిన పీఎంపీ, ఆర్​ఎంపీలు

    అక్షరటుడే, హైదరాబాద్: Health Minister : రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ(Minister Damodar Rajanarsimha)ను శుక్రవారం...

    Phone Tapping Case | బండి సంజయ్​ ఫోన్​ ట్యాపింగ్​.. వాంగ్మూలం అడిగిన అధికారులు

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Phone Tapping Case | తెలంగాణలో సంచలనం సృష్టించిన ఫోన్​ ట్యాపింగ్​ కేసు (Phone...