అక్షరటుడే, వెబ్డెస్క్: Water ATM | ప్రస్తుతం నగరాల్లో జనాభా విపరీతంగా పెరుగుతోంది. ఎంతో మంది పొట్ట చేత పట్టుకొని బతుకుదెరువు కోసం నగరాలకు వలస వెళ్తున్నారు. అయితే మహా నగరాల్లో గుక్కెడు తాగునీరు దొరకని పరిస్థితి ఉంది. తాగునీరు దొరకక ప్రజలు కొనుక్కొని తాగాల్సి వస్తోంది. దీంతో పేద ప్రజలు అనేక ఇబ్బందులు పడుతున్నారు. ఈ క్రమంలో తమిళనాడు ప్రభుత్వం(Tamil Nadu Government) కీలక నిర్ణయం తీసుకుంది.
తమిళనాడులో పేదలు, మధ్య తరగతి ప్రజలకు తాగునీటికి ఇబ్బంది పడకుండా మినరల్ వాటర్ మెషిన్లను(Mineral water machines) ఏర్పాటు చేసింది ప్రభుత్వం. నీటి ఎద్దడి తీవ్రంగా ఉన్న ప్రాంతాలను గుర్తించి వాటర్ ఏటీఎంలను ఏర్పాటు చేస్తున్నారు. ఇందులో భాగంగా ఈ నెల 18న 50 వాటర్ వెండింగ్ మెషిన్లను సీఎం స్టాలిన్(CM Stalin) ప్రారంభించారు.
Water ATM | 24 గంటలు ఉచిత వాటర్
మెట్రో వాటర్ డెవలప్ మెంట్(Metro Water Development) ఆధ్వర్యంలో ఈ మెషీన్లను ఏర్పాటు చేశారు. 24 గంటలు ఈ మెషిన్ల ద్వారా ఉచిత తాగునీరు అందిస్తారు. పేదలు, మధ్య తరగతి ప్రజలకు మినరల్ వాటర్(Mineral water) అందించడమే లక్ష్యంగా వీటిని ఏర్పాటు చేసినట్లు ప్రభుత్వం తెలిపింది. నగరంలోని మొత్తం ఆరు జోన్లకు ఈ మెషిన్లను విస్తరించనున్నారు. బీచ్లు, పార్కులు, ఆలయాలు, బస్ డిపోలు, రైల్వే టెర్మినల్స్, మార్కెట్లు తదితర ప్రాంతాలలో వీటిని ఏర్పాటు చేయాలని ప్రణాళికలు సిద్ధం చేశారు. దీంతో ఆయా ప్రాంతాల్లో పేద, మధ్య తరగతి వారికి తాగునీటికి ఇబ్బందులు తప్పుతాయని ప్రభుత్వం పేర్కొంటుంది.