అక్షరటుడే, వెబ్డెస్క్: Rythu Bharosa | రైతులకు పెట్టుబడి సాయం అందించడానికి ప్రభుత్వం రైతు భరోసా అందిస్తున్న విషయం తెలిసిందే. అయితే వానాకాలం సీజన్ రైతు భరోసా(Rythu Bharosa) పొందడానికి ప్రభుత్వం కొత్త రైతులకు అవకాశం కల్పించింది. జూన్ 5 లోపు పట్టాపాస్బుక్ పొందిన వారు ఏఈవోల వద్ద దరఖాస్తు చేసుకోవాలని సూచించింది. జూన్ 20(శుక్రవారం)లోగా దరఖాస్తు చేసుకుంటే ఈ సీజన్కు సంబంధించి రైతు భరోసా జమ చేస్తామని పేర్కొంది. ఈ రోజు సాయంత్రం ఐదు గంటలలోపు గడువు ముగియనున్న నేపథ్యంలో గతంలో రైతు భరోసా పొందని వారు, కొత్తగా పాస్బుక్లు వచ్చిన వారు దరఖాస్తు చేసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు. అలాగే బ్యాంక్ అకౌంట్ మార్చుకోవాలనుకునే వారికి కూడా నేటితో గడువు ముగుస్తుందని తెలిపారు.
Rythu Bharosa | నాలుగు రోజుల్లో రూ.6,405 కోట్లు జమ
రాష్ట్ర ప్రభుత్వం(State Government) రైతు భరోసాను వేగంగా జమ చేస్తోంది. ఇప్పటి వరకు ఐదు ఎకరాలలోపు రైతుల ఖాతాల్లో ఎకరాకు రూ.6 వేల చొప్పున జమ చేసింది. 4 రోజుల్లో రూ.6,405 రైతులకు(Farmers) ఖాతాల్లో జమ అయ్యాయి. తొమ్మిది రోజుల్లో రూ.9 వేల కోట్ల రైతు భరోసా విడుదల చేస్తామని ప్రభుత్వం తెలిపిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో శుక్రవారం మరో రూ.1,500 కోట్లు ప్రభుత్వం విడుదల చేయనుంది.