అక్షరటుడే, ఇందూరు: Olympic Run | జిల్లా క్రీడాకారులు అంతర్జాతీయ స్థాయికి ఎదగాలని పోలీస్ కమిషనర్ సాయి చైతన్య (Police Commissioner Sai Chaitanya) అన్నారు. ఒలింపిక్ అసోసియేషన్ (Olympic Association) ఆధ్వర్యంలో శుక్రవారం ఒలింపిక్ రన్ నిర్వహించారు. నగరంలోని ఆర్ఆర్ చౌరస్తా నుంచి ప్రారంభమైన రన్ పెద్ద బజార్, నెహ్రూ పార్క్, గాంధీ చౌక్, బస్టాండ్ మీదుగా పాత కలెక్టరేట్ మైదానం వరకు కొనసాగింది.
ఈ సందర్భంగా సీపీ మాట్లాడుతూ.. ఇప్పటికే ఆయా క్రీడల్లో జిల్లా క్రీడాకారులు దేశానికి ప్రాతినిథ్యం వహించడం గొప్ప విషయమన్నారు. వారిని స్ఫూర్తిగా తీసుకొని మరింత మంది క్రీడాకారులు పైకి రావాలన్నారు. చదువుతోపాటు క్రీడలు ఎంతో అవసరమని పేర్కొన్నారు. రన్లో స్కేటింగ్ క్రీడాకారులు ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. కార్యక్రమంలో నుడా ఛైర్మన్ కేశ వేణు (Nuda Chairman Kesha Venu), ఒలింపిక్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు ఈగ సంజీవరెడ్డి (Eega Sanjeeva Reddy), ఛైర్మన్ లింగయ్య, కార్యదర్శి బొబ్బిలి నర్సయ్య, ఆయా క్రీడా సంఘాల ప్రతినిధులు, వ్యాయామ ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.

ఒలింపిక్ రన్లో పాల్గొన్న వివిధ పాఠశాలల విద్యార్థులు