అక్షరటుడే, వెబ్డెస్క్ : Encounter | మావోయిస్టులకు మరో ఎదురుదెబ్బ తగిలింది. ఛత్తీస్గఢ్(Chhattisgarh)లో జరిగిన ఎన్కౌంటర్ ఇద్దరు మావోలు మృతి చెందారు. కాంకేర్ జిల్లా(Kanker District)లో చోటే భేథియాలో శుక్రవారం ఉదయం ఈ ఎన్కౌంటర్ చోటు చేసుకుంది. ఆపరేషన్ కగార్(Operation Kagar)లో భాగంగా బలగాలు ఛత్తీస్గఢ్లోని అడవులను జల్లెడ పడుతున్నాయి. ఈ క్రమంలో వరుస ఎన్కౌంటర్లు చోటు చేసుకుంటుండడంతో భారీ సంఖ్యలో మావోయిస్టులు మృతి చెందుతున్నారు.
Encounter | స్వగ్రామానికి గాజర్ల రవి మృతదేహం
ఆంధ్రప్రదేశ్(Andhra Pradesh)లోని అల్లూరి సీతారామరాజు జిల్లాలో బుధవారం జరిగిన ఎన్కౌంటర్(Encounter)లో ముగ్గురు మృతి చెందారు. ఇందులో మావోయిస్టు అగ్రనేత, ఏవోబీ స్పెషల్ జోనల్ కమిటీ కార్యదర్శి గాజర్ల రవి అలియాస్ ఉదయ్ అలియాస్ గణేశ్ కూడా మృతి చెందాడు. ఆయన స్వగ్రామం తెలంగాణలోని భూపాలపల్లి జిల్లా(Bhupalapally District) టేకుమల్ల మండలం వెలిశా. దీంతో రవి మృతదేహాన్ని స్వగ్రామానికి తరలించారు. శుక్రవారం వెలిశాల గ్రామంలో ఆయన అంత్యక్రియలు నిర్వహించనున్నారు.
Encounter | భయం గుప్పిట్లో ఏజెన్సీ ప్రాంతాలు
ఆపరేషన్ కగార్ ఆపాలని మావోయిస్టులు(Maoists) శుక్రవారం తెలుగు రాష్ట్రాల బంద్కు పిలుపునిచ్చిన విషయం తెలిసిందే. ఈ మేరకు మావోయిస్టు అధికార ప్రతినిధి జగన్ ఇటీవల లేఖ విడుదల చేశారు. దీంతో తెలుగు రాష్ట్రాల్లోని ఏజెన్సీ ప్రాంతాలు భయం గుప్పిట్లో ఉన్నాయి. ములుగు జిల్లాలో సాయుధ బలగాలు హైఅలర్ట్ ప్రకటించాయి. ఏపీలోని ఒడిశా సరిహద్దులో సైతం పోలీసులు ముమ్మరంగా తనిఖీలు చేపడుతున్నారు.