అక్షరటుడే, వెబ్డెస్క్: Hyderabad Airport | హైదరాబాద్ శంషాబాద్లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం (Rajiv Gandhi International Airport) మరింత అభివృద్ధి చెందనుంది. దీనిని మరింత అభివృద్ధి చేసేందుకు జీఎంఆర్ గ్రూప్(GMR Group) ముందుకొచ్చి దాదాపు ₹14,000 కోట్ల భారీ విస్తరణ ప్రాజెక్టును ప్రకటించింది. ఈ ప్రాజెక్టు ద్వారా విమానాశ్రయాన్ని ప్రపంచ స్థాయిలో తీర్చిదిద్దేలా ప్రణాళికలు రూపొందించారు. విస్తరణలో భాగంగా కొత్త ప్రయాణికుల టెర్మినల్ నిర్మించనున్నారు. సంవత్సరానికి 47 మిలియన్ల ప్రయాణికుల సామర్థ్యం కలిగిన ఆధునిక టెర్మినల్(Modern terminal) నిర్మించనున్నారు. దీని అంచనా ఖర్చు రూ.5,843 కోట్లు.
Hyderabad Airport | మరిన్ని సదుపాయాలు..
రెండో రన్వేతో పాటు ఎలివేటెడ్ క్రాస్ టాక్సీవే(Elevated Cross Taxiway).. విమానాల అధిక రాకపోకలను సులభతరం చేసేందుకు మరో రన్వే నిర్మాణంతోపాటు, ఎలివేటెడ్ టాక్సీవే కూడా ఉంటుంది. ఈ పనులకు రూ.2,809 కోట్లు కేటాయించారు. కార్గో, మెట్రో కనెక్టివిటీ, పార్కింగ్ మెరుగుదల కూడా ఈ ప్రణాళికలో ఉంది. విమానాశ్రయం నుంచి నగరానికి మెట్రో రవాణాను కలిపే ప్రణాళిక, కార్గో టెర్మినల్స్(Cargo terminals) విస్తరణ, పార్కింగ్ స్థలాల పెంపు తదితర అంశాలపై కూడా దృష్టి సారించారు.
ఈ మెగా ప్రాజెక్టును 2026 నుండి 2031 ఆర్థిక సంవత్సరాంతం వరకు దశలవారీగా పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ఈ విస్తరణతో హైదరాబాద్ విమానాశ్రయం(Hyderabad Airport) కేవలం దక్షిణ భారతదేశానికి కాకుండా, అంతర్జాతీయ స్థాయిలో కీలక హబ్గా మారే అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు. ప్రయాణికులకు వేగవంతమైన సేవలు, మరింత ఆధునిక వసతులు అందుబాటులోకి రానున్నాయి. ఈ ప్రాజెక్టు పూర్తయితే, హైదరాబాద్ ఎయిర్పోర్టు దేశంలో అత్యుత్తమ మౌలిక సదుపాయాలు కలిగిన విమానాశ్రయాల్లో ఒకటిగా నిలవనుంది.