అక్షరటుడే, వెబ్డెస్క్ : Banakacharla | ముఖ్యమంత్రి రేవంత్రెడ్డికి (CM Revanth Reddy) ప్రాజెక్ట్ల విషయంలో బేసిక్స్ తెలియవని మాజీ మంత్రి హరీశ్రావు (Harish Rao) ఎద్దేవా చేశారు. బనకచర్ల ప్రాజెక్ట్ (Banakacharla Project)పై గురువారం ఆయన తెలంగాణ భవన్ (Telangana Bhavan)లో మీడియాతో మాట్లాడారు.
సీఎం రేవంత్రెడ్డికి బేసిన్లు తెలియవు.. బేసిక్స్ తెలియవు అని విమర్శించారు. దేవాదుల ప్రాజెక్ట్ (Devadula Project) ఏ బేసిన్లో ఉందో కూడా సీఎంకు తెల్వదన్నారు. బనకచర్లపై రేవంత్ అసత్యాలు చెప్పారన్నారు. ఆంధ్రా జల దోపిడీని అడ్డుకోమంటే తమపై విమర్శలు చేస్తున్నారని హరీశ్రావు ఆగ్రహం వ్యక్తం చేశారు.
Banakacharla | కలిసి అడ్డుకుందాం
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అక్రమంగా నిర్మిస్తున్న బనకచర్ల ప్రాజెక్ట్ను అందరం కలిసి అడ్డుకుందామని ఆయన సూచించారు. బీఆర్ఎస్ తరఫున బనకచర్ల ఆపడానికి సహకరిస్తామని చెప్పారు. అసెంబ్లీలో తీర్మానం చేస్తే మద్దతిస్తామన్నారు.
Banakacharla | కేసీఆర్ 1900 టీఎంసీలు అడిగారు
కేసీఆర్ గోదావరిలో (Godavari) 1,900 టీఎంసీలు కావాలని అడిగినట్లు హరీశ్రావు చెప్పారు. కానీ, సీఎం రేవంత్ 1000 టీఎంసీలు చాలంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణకు గోదావరిలో 946 టీఎంసీలకు సీడబ్ల్యూసీ అనుమతి ఇచ్చిందని, మరో 20 టీఎంసీలు సూత్రప్రాయంగా ఆమోదించిందని చెప్పారు. రేవంత్ మాటలు విని ప్రజలు నవ్వుకుంటున్నారని వ్యాఖ్యానించారు. కేసీఆర్ జీవితం అంతా నీటి కోసం పోరాడారు అని హరీశ్ అన్నారు. కృష్ణా ట్రైబ్యునల్ ముందు 750 టీఎంసీల నీరు రావాలని పోరాడామన్నారు. ఉమ్మడి రాష్ట్రంలో కాంగ్రెస్ చేసిన పాపంతో కృష్ణాలో 220 టీఎంసీలే తెలంగాణకు వచ్చాయని ఆయన చెప్పారు.