అక్షరటుడే ఇందూరు: Olympic Run | జిల్లా ఒలింపిక్ అసోసియేషన్ (District Olympic Association) ఆధ్వర్యంలో ఈనెల 20న నిర్వహించే ఒలింపిక్ రన్కు ఏర్పాట్లు పూర్తి చేసినట్లు జిల్లా అధ్యక్షుడు ఈగ సంజీవరెడ్డి (Eega Sanjeeva Reddy) తెలిపారు. గురువారం ఆయా క్రీడా సంఘాల ప్రతినిధులతో సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఒలింపిక్ రన్ నగరంలోని రాజరాజేంద్ర థియేటర్ (Raja Rajendra Theatre) చౌరస్తా నుంచి ప్రారంభమై పెద్ద బజార్, గాంధీ చౌక్, బస్టాండ్ మీదుగా పాత కలెక్టరేట్ మైదానం వరకు కొనసాగుతుందన్నారు. కావున వివిధ క్రీడా సంఘాల ప్రతినిధులు, విద్యార్థులు, పీఈటీలు, సీనియర్ క్రీడాకారులు, రాజకీయ ప్రముఖులు పాల్గొనాలని పిలుపునిచ్చారు. సమావేశంలో ఛైర్మన్ లింగయ్య, కార్యదర్శి బొబ్బిలి నర్సయ్య, భూమారెడ్డి, స్వామి కుమార్, సురేష్, సంజీవరెడ్డి తదితరులు పాల్గొన్నారు.