అక్షరటుడే, కామారెడ్డి: Mahadev Maharaj Swami | యోగా డే సందర్భంగా జిల్లా కేంద్రంలోని మెహెర్ బాబా గార్డెన్లో (Meher Baba Garden) నిర్వహించనున్న యోగా మహోత్సవానికి (Yoga day) ప్రతిఒక్కరూ తరలిరావాలని గాంధారి మండలం గుడిమెట్ మహదేవుని ఆలయం స్వామీజీ మహాదేవ్ మహరాజ్ కోరారు. ఈ మేరకు విలేకరులతో మాట్లాడారు. యోగా మహోత్సవం శనివారం ఉదయం 10:40 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు కార్యక్రమం ఉంటుందన్నారు.
యోగాసనాలతో పాటు ధ్యానం, ఇతర వ్యాయామాలు ఎలా చేయాలో తరగతులు నిర్వహిస్తామని స్పష్టం చేశారు. కార్యక్రమానికి యోగా గురువులు, స్వామిజీలు హాజరవుతారని వివరించారు. ఆంధ్రప్రదేశ్లోని (Andhrapradesh) పల్నాడు (Palnadu) జిల్లా చిలకలూరిపేటలో (Chilakaluripet) పాస్టర్ శామ్యూల్ మహిళలపై చేసిన అనుచిత వ్యాఖ్యలను ఖండిస్తున్నామని ఆయన పేర్కొన్నారు. సమావేశంలో యోగా గురువు బండి రాములు పాల్గొన్నారు.