అక్షరటుడే, వెబ్డెస్క్: Bengaluru Airport | బెంగళూరులోని కెంపెగౌడ అంతర్జాతీయ విమానాశ్రయంలో(Kempegowda International Airport) బాంబు బెదిరింపు ఘటన కలకలం రేపింది. ఎయిర్పోర్ట్లో రెండు బాంబులు పెట్టినట్లు విమానాశ్రయ భద్రత విభాగానికి గుర్తు తెలియని వ్యక్తులు మెయిల్ పెట్టారు. దీంతో అప్రమత్తమైన అధికారులు తనిఖీలు చేపట్టారు. విమానాశ్రయం(Bengaluru Airport) అంతటా గాలించారు. ఎలాంటి పేలుడు పదార్థాలు లభించకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.
Bengaluru Airport | ఆందోళన కలిగిస్తున్న నకిలీ కాల్స్
బాంబు బెదిరింపు(Bomb Threat) పేరిట ఫేక్ కాల్స్ అధికారులతో పాటు, ప్రయాణికులను ఆందోళనకు గురి చేస్తున్నాయి. ఇటీవల ఇలాంటి బెదిరింపు రావడంతో పలు విమానాలను అత్యవసరంగా ల్యాండింగ్(Emergency Landing) చేసిన విషయం తెలిసిందే. విమానాశ్రయాలు, రైల్వే స్టేషన్లలో బాంబు పెట్టినట్లు బెదిరింపులకు పాల్పడుతుండడంతో అధికారులు అప్రమత్తమై తనిఖీలు చేపడుతున్నారు. అయితే నకిలీ ఫోన్ కాల్స్(Fake phone calls)తో ప్రయాణికులు ఆందోళన చెందుతున్నారు. విమానాలు, రైళ్లు ఆలస్యం అవుతుండడంతో వారి సమయం వృథా అవుతోంది. ఇలా నకిలీ ఫోన్ కాల్స్ చేసే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.